Asianet News TeluguAsianet News Telugu

సిమ్ స్వాప్‌తో లక్షలు కొల్లగొట్టే ముఠా: అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు

Cyberabad police arrested SIM Swap fraud gang lns
Author
Hyderabad, First Published Jan 21, 2021, 5:13 PM IST


హైదరాబాద్: సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. 

మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్ ను సైబరాబాద్ పోలీసులు పట్టుకొన్నారు.నిందితుల నుండి 40 నకిలీ ఆధార్ కార్డులు, 4 రబ్బరు స్టాంపులు, 15 మొబైల్ ఫోన్లు, నకిలీ లెటర్ ప్యాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్  వీసీ సజ్జనార్ గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 2011 నుండి సిమ్ స్వాప్ దందా నిర్వహిస్తోందన్నారు. దీని ద్వారా ఈ ముఠా కోట్లను కాజేశారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురి అరెస్ట్ చేశారు.

పలు సంస్థల ఆర్ధిక లావాదేవీలు చేస్తున్న ఫోన్ నెంబర్లనే లక్ష్యంగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారని ఆయన చెప్పారు.

నిందితుల నుండి రూ. 11 లక్షలు కాజేశారన్నారు. ఈ ముఠాకు సంబంధించి దేశ వ్యాప్తంగా అనేక అకౌంట్లు ఉన్నాయన్నారు. కాజేసిన డబ్బులను బిట్ కాయిన్, హవాలా ద్వారా నైజీరియాకు తరలించారని ఆయన వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios