రేవంత్ ముమైత్ ఖాన్ కాదు... నువ్వే శ్రీరెడ్డివి: కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఫైర్
కాాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
కరీంనగర్: గతంలో రేవంత్ రెడ్డి బూట్లు నాకినోడివి నువ్విప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నావా? అంటూ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి మండిపడ్డారు. మమైత్ ఖాన్ తో రేవంతన్నను పోలుస్తావా బిడ్డా.. నువ్వే శ్రీరెడ్డి లా వ్యవహరిస్తున్నావు అంటూ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
జమ్మికుంట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అత్తాపూర్ సమీపంలో ఓ పెట్రోల్ బంక్, తిరుమల నగర్ లో మరో పెట్రోల్ బంక్ లీజుకు తీసుకున్నాడు కౌశిక్ రెడ్డి. అయితే 25సంవత్సరాల లీజు అగ్రిమెంట్ అయిపోయి ఆ పెట్రోల్ బంక్ మూత పడ్డాయి. అయితే అత్తాపూర్ పెట్రోల్ బంక్ వద్ద 25గుంటల ప్రభుత్వ స్థలం కౌశిక్ కబ్జా చేసి కుక్కల ఫామ్ పెట్టాడు. ఆ ఆస్తులను కాపాడుకోడానికే టీఆర్ఎస్ లో చేరాడని ఆరోపించారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఒకరు కుక్కల ఫామ్, మరొకరు కోళ్ల ఫామ్ బిజినెస్ లు చేస్తున్నారని కృష్ణారెడ్డి ఆరోపించారు. ఇలాంటి వారు ఇప్పుడు సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇచ్చే స్క్రిప్టు చదివే నీకు సిగ్గు ఉండాలి అని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు.
read more ఈ నెల 16న టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి..! మరో సీనియర్ నేత కూడా...!!
''నువ్వు, నీ ఆన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నది వాస్తవం కాదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీకు టికెట్ ఇస్తా అని చెప్పిండా, అప్పుడు నీ వయస్సు ఎంత, చెడ్డిలు కూడ వేసుకోలేదు బిడ్డా. నీకు 61వేల ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్నావు. నువ్వు ఒక్కడివి పోటీ చేస్తే ఓట్లు వచ్చాయా... మేము అందరం పని చేస్తే ఓట్లు వచ్చాయా?'' అని నిలదీశాడు.
''కేసీఆర్ గురించి నీకు తెలువదు... బొక్క బోర్లా పడతావు బిడ్డా. హుజురాబాద్ కు నువ్వు వస్తే టమాటాలు, కోడిగుడ్లతో కొడతారు బిడ్డ జాగ్రత్త'' అంటూ కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి హెచ్చరించారు.