Asianet News TeluguAsianet News Telugu

శాలపల్లి: నాడు రైతుబంధు, నేడు దళితబంధు శ్రీకారానికి ప్లాన్


రైతు బంధు ప్రారంభించిన గ్రామంలోనే  దళిత బంధు ప్రారంభించేందుకు కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శాలపల్లిలో దళితబంధును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

CM KCR to launch Dalit Bandhu at Shalapalli in Huzurabad lns
Author
Karimnagar, First Published Aug 4, 2021, 1:14 PM IST


కరీంనగర్: పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని  హుజూరాబాద్ నియోజకవర్గంలో  ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గతంలో రైతు బంధు పథకాన్ని ఏ గ్రామంలో ప్రారంభించారో అదే గ్రామంలోనే దళిత బంధు పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్  భావిస్తోంది.2018 లో హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఇదే గ్రామంలో  దళితబంధు పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. రైతు బంధు పథకం ఈ గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం చాలా విజయవంతంగా అమలు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఇతర అధికారులు ఈ గ్రామాన్ని మంగళవారం నాడు సందర్శించారు.

ఈ నెల 16వ తేదీన శాలపల్లి గ్రామంలో దళితబంధు పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 1 లక్షమంది పాల్గొనే అవకాశం ఉంది.దళిత బంధును హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేయడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఈ పథకాన్ని  అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కేసీఆర్ ను విపక్షాలు కోరుతున్నాయి.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios