Asianet News TeluguAsianet News Telugu

మహాత్ముడు ఏనాటికైనా మహాత్ముడే.. జాతిని చీల్చేందుకు చేసే ప్రయత్నాలను ఖండించాలి: కేసీఆర్

తెలంగాణలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం మహాత్మ గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. 

CM KCR speech at  15 day Swatantra Bharata Varotsavam lauch
Author
First Published Aug 8, 2022, 2:09 PM IST

స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు ఆనాడు పెద్దలు ఎంతో కష్టపడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వందలాది మంది సంస్థానాల అధిపతులను ఒప్పించారని.. రాజభరణాలు ఇచ్చారని తెలిపారు. 1947 ఆగస్టు 15 తర్వాత ఒక్కోక్కటిగా జమ్ము కశ్మీర్, జునాగఢ్, ఇండోర్, హైదరాబాద్, గోవా, పాండిచ్చేరిలు, సిక్కింలు.. దేశంలో విలీనమయ్యామని చెప్పారు. కేసీఆర్.. సోమవారం ఉదయం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో త్రివర్ణ పతాకం ఆవిష్కరించి  తెలంగాణలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మహాత్మ గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. తర్వాత వేదికపై 75 మంది వీణ కళాకారులచే వీణా వాద్య ప్రదర్శన నిర్వహించారు. శాండ్ ఆర్ట్‌తో స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను ప్రదర్శించారు. వేదికపై దేశభక్తి ప్రబోధ నృత్యం, ప్యూజన్ డ్యాన్స్, లేజర్ షోను ఏర్పాటు చేశారు. 

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. అనేక త్యాగాలు, అనేక పోరాటలతో భారత్‌కు స్వాతంత్ర్యం చేకూరిందని చెప్పారు. ఏ దేశానికైనా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనేది అపూరూప సందర్భం అని చెప్పారు. ఉద్యమ కారులను బ్రిటీష్ ప్రబుత్వం దారుణంగా అణచివేసిందని గుర్తుచేశారు. స్వయం పాలనలో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. కొత్తతరం వారికి స్వాతంత్ర్య పోరాటం చేసిన త్యాగాల గురించి తెలియవని.. వాటిని ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజెప్పడం పాత తరం వారి కర్తవ్యం అని అన్నారు. ఒకటిన్నర శతాబ్దం పాటు భారత స్వాతంత్ర్య పోరాటం సుదీర్ఘంగా సాగిందని చెప్పారు. గాంధీజీ గురించి ఒబామా, మార్టిన్ లూథర్ కింగ్, ఐన్‌స్టీన్‌, నెల్సన్ మండేలా చెప్పిన గొప్ప మాటలను గుర్తుచేశారు. 

గాంధీజీ శాంతిదూత, విశ్వ మానవుడని  కొనియాడారు. గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారు. ఎన్నో దేశాల్లో స్వతంత్ర్య పోరాటాలకు గాంధీజీ స్ఫూర్తిగా నిలిచారు. ఆ సేతు హిమాచలం ఒక్కటై పోరాటం జరిపి స్వాతంత్య్రం తెచ్చారని చెప్పారు. పేదరికం ఉన్నంతకాలం.. దేశంలో అలజడులు, అశాంతి ఉంటాయని అన్నారు. దేశంలో పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ది సాధ్యం అని చెప్పారు. ప్రతి భారతీయుడు ఇది నా దేశం అని తలెత్తుకుని చెప్పేలా ప్రయత్నాలు  చేయాలని కోరారు. 

విశ్వమానవుడని కీర్తించే మహాత్మ గాంధీని కించపరిచేలా జరుగుతున్న కొన్ని ఘటన చూస్తుంటే బాధవేస్తుందని  చెప్పారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను మలినం చేసుకోదని చెప్పారు. అలాంటి ప్రయత్నాలు ఎక్కడ జరిన మనమంతా సమిష్టిగా ఖండించాలని కోరారు.  మహాత్ముడు ఏనాటికైనా మహాత్మునిగానే ఉంటారని తెలిపారు. జాతీని చీల్చేందుకు చేసే కుట్రలను, చిల్లర చేష్టలను మనమంతా ఖండించాలని కేసీఆర్ అన్నారు. ఒక కూర్పు వెనక ఎంతో కష్టం ఉంటుందన్నారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో వెళ్లి పనిచేయడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కామన్ వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించి.. స్వాతంత్ర్య వేడుకల గొప్ప కానుక తెచ్చిందని అన్నారు. నిఖత్ జరీన్‌కు కేసీఆర్ అభినందనలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios