Asianet News TeluguAsianet News Telugu

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అటకెక్కింది: కేసీఆర్ కు భట్టి విక్రమార్క లేఖ


పాలమూరు-రంగారెడ్డి  లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టు  నిర్మాణ పనులు  ఆటకెక్కాయని   సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క   విమర్శించారు.  ఈ విషయమై  కేసీఆర్ కు  లేఖ  రాశారు.

CL P Leader  MalluBhatti  Vikramarka  Writes  Letter  To CM  KCR  lns
Author
First Published May 28, 2023, 4:31 PM IST

మహబూబ్ నగర్:  తెలంగాణ సీఎం  కేసీఆర్ కు సీఎల్పీ   నేత  మల్లు భట్టి విక్రమార్క ఆదివారంనాడు లేఖ రాశారు. పాలమూరు - రంగారెడ్డి  జిల్లా  ప్రాజెక్టు  పనుల విషయమై సీఎల్పీ నేత  భట్టి విక్రమార్క    ప్రస్తావించారు.పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టు  అటకెక్కిందని  ఆయన  విమర్శించారు.  కుర్చీ వేసుకుని  ఈ ప్రాజెక్టును పూర్తి  చేస్తామని   ఇచ్చిన  హామీని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  ఆ లేఖలో  గుర్తు  చేశారు. 

వట్టెం  రిజర్వాయర్ భూ నిర్వాసితులకు   పరిహారం ఇవ్వలేదన్నారు.  భూ  నిర్వాసితులు సర్వం  కోల్పోయి దయనీయస్థితిలో ఉన్నారన్నారు.  పునరావాస  ప్యాకేజీ  కింద   ఊరు  నిర్మించి  ఇవ్వాలని  ఆయన  డిమాండ్  చేశారు.  పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టు  నిర్మాణ పనులపై  కేసీఆర్  సర్కార్  నిర్లక్ష్యం  చూపుతుందని   కాంగ్రెస్  విమర్శలు  చేస్తుంది. 

ఉమ్మడి  మహబూబ్ నగర్  జిల్లాలో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర  సాగుతుంది.  పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టు   పరిధిలో  రిజర్వాయర్ల  పనులను  భట్టి విక్రమార్క  పరిశీలించారు. పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టు  కారణంగా  ఉమ్మడి  పాలమూరుతో పాటు  రంగారెడ్డి  జిల్లాకు  సాగు , తాగు నీరు  సౌకర్యం అందుబాటులోకి రానుంది. 

ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలోనే   పాలమూరు- రంగారెడ్డి  ప్రాజెక్టు  నిర్మాణంపై  డిమాండ్  మొదలైంది.  తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్   అధికారంలోకి వచ్చిన తర్వాత  ఈ ప్రాజెక్టు  పనులను  ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుపై  ఏపీ  ప్రభుత్వం  కేఆర్ఎంబీకి, కేంద్రానికి  ఫిర్యాదు  చేసిన విషయం  తెలిసిందే.  తెలంగాణ  ప్రభుత్వం  కూడా  ఏపీ నిర్మిస్తున్న  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి  ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ,  కేంద్రానికి  ఫిర్యాదు  చేసిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios