చెన్నూరు నియోజకవర్గంలో ఓ ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. సీపీఐ నారాయణ బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారంటూ ఓ ఓటర్ నిలదీశాడు. 

చెన్నూరు : కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా సిపిఐకి చెన్నూరు సీటును కేటాయించింది. దీనిమీద మండిపడ్డ ఓ ఓటర్ చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో వైరల్ గా మారింది. సీపీఐ నారాయణకు ఫోన్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి, చెన్నూరును ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించాడు. బాల్కాసుమను గెలిపించే ప్రయత్నమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బీఆర్ఎస్ కు అమ్ముడుపోతున్నారు అంటూ మండిపడ్డాడు. దీనికి నారాయణ కాంగ్రెస్ అక్కడే ఇచ్చిందని ఏదో చెప్పబోతుంటే.. అతను వినకుండా.. ‘గెలిచేదగ్గర నిలబడండి సార్.. గెలవని దగ్గర ఎందుకు సీటు అడుగుడు.. బాల్కా సుమన్ తో కుమ్మక్కైనట్టున్నారు.. మీ వయసుకు తగ్గట్టు పనిచేయండి సార్’ అంటూ దులిపేశాడు.