పీవీ ఎక్స్ప్రెస్ వే ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టి, పల్టీలు కొట్టిన కారు..
వేగంగా వెడుతున్న కారు డివైడర్ ను డీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.
రంగారెడ్డి : రాజేంద్రనగర్ - అత్తాపూర్ పీవీ ఎక్స్ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది.
వేగంగా వెడుతున్న కారు డివైడర్ ను డీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.
విషయం తెలిసిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. ఈ ప్రమాద ఘటన మీద రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణం అని పోలీసులు అంటున్నారు. అయితే ఈ ఘటనలో పేను ప్రమాదం తప్పింది. కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళ ఓ వ్యక్తి ను కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది.