Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..తెలంగాణకు కొద్దిలో మిస్సయిన మరో ఘోర విషాదం (వీడియో)

కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా మరణించిన ఘోర విషాదం ఇంకా మరచిపోకముందే తెలంగాణలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.

bus accident in nagar kurnool district
Author
Nagarkurnool, First Published Sep 16, 2018, 11:22 AM IST

కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా మరణించిన ఘోర విషాదం ఇంకా మరచిపోకముందే తెలంగాణలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.. యాదాద్రి భువనగిరి జిల్లాకు యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు ఈ రోజు నాగర్‌కర్నూలు జిల్లాలోని వట్టెంపాడు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ముందున్న రెండు చక్రాలు ఊడిపోయాయి.

bus accident in nagar kurnool district

బస్సు వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బస్సు పక్కనున్న పొలాల్లొకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.. ప్రమాద సమయంలో బస్సులో 105 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలా మంది వీఆర్‌వో పరీక్షకు వెళుతున్న విద్యార్థులే. 

bus accident in nagar kurnool district

bus accident in nagar kurnool district

"

Follow Us:
Download App:
  • android
  • ios