సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. గడిచిన నాలుగేళ్లుగా అద్దె ఇవ్వడం లేదంటూ భవన యజమానులు కార్యాలయానికి మంగళవారం తాళం వేసి షాకిచ్చారు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. గడిచిన నాలుగేళ్లుగా అద్దె ఇవ్వడం లేదంటూ భవన యజమానులు కార్యాలయానికి మంగళవారం తాళం వేసి షాకిచ్చారు. ఉదయం రోజూలాగే కార్యాలయానికి వచ్చిన అధికారులు, సిబ్బంది ఆఫీసుకు తాళం వేసి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. అనంతరం యజమానికి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయానికి వచ్చి భవన యజమానులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
