Asianet News TeluguAsianet News Telugu

సంక్షేమం పేరుతో బీఆర్‌ఎస్ స‌ర్కారు ప్రజాధనాన్ని పార్టీ కార్యకర్తలకు పంచుతోంది : కాంగ్రెస్

Khammam: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, 85 సీట్లకు పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న ఆరు హామీలు ప్రకటించిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ సునామీని బీజేపీ, టీఆర్ఎస్ తట్టుకోలేవని అన్ని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయని కూడా ఆరోపించారు.
 

BRS government distributing public money to party workers in the name of welfare: Congress RMA
Author
First Published Oct 9, 2023, 1:26 PM IST

Telangana Congress: సంక్షేమం పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని పార్టీ కార్యకర్తలకు పంచుతోందని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పువ్వళ్ల దుర్గాప్రసాద్‌, నగర కాంగ్రెస్‌ కన్వీనర్‌ మహ్మద్‌ జావీద్‌ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా వివిధ పథకాల పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలకు నిధులు మంజూరు చేస్తోందని విమర్శించారు. బీసీ రుణాల చెక్కులు, దళిత బంధు పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తున్న ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించారు.

కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు హామీ పథకాలకు ప్రజల నుంచి స్పందన రావడాన్ని బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. జర్నలిస్టులను ప్రభుత్వం మోసం చేసిందని, ఇళ్ల స్థలాల వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు. పీసీసీ సభ్యులు, జిల్లా ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌, జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొక్కా శేఖర్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇదిలావుండ‌గా, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, 85 సీట్లకు పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న ఆరు హామీలు ప్రకటించిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ సునామీని బీజేపీ, టీఆర్ఎస్ తట్టుకోలేవని అన్ని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయని కూడా ఆరోపించారు.

2018 ఎన్నికల తర్వాత అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ కు మద్దతిస్తామని చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తోందన్నారు. ఇదిలావుండగా, ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ లోకి క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు కాంగ్రెస్ లో చేరారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ఆ పార్టీ ధీమా వ్య‌క్తం చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios