కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన.. పలువురి తీవ్రగాయాలు..
ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా - మధిర మధ్య నిర్మిస్తున్న భారీ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు గాయపడ్డారు.
![Bridge under construction by Adani linked group collapses in Khammam Telangana KRJ Bridge under construction by Adani linked group collapses in Khammam Telangana KRJ](https://static-ai.asianetnews.com/images/01hmfbttzr94vn3jr93t17cmhq/khammam-bridge-jpg_363x203xt.jpg)
ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా మండలం సోమారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. నివేదికల ప్రకారం.. అండర్పాస్కు ఇరువైపులా వంతెన కాంక్రీట్ స్లాబ్ను మధ్యాహ్నం వేశారు. సాయంత్రం కూలీలు రోజు పని ముగించుకుని వెళ్లే సరికి స్లాబ్కు మద్దతుగా ఉన్న స్కాఫోల్డింగ్, మెటల్ షీట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు స్వల్ప గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్కాఫోల్డింగ్ను ఏర్పాటు చేయడంలో లోపాలే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహిస్తోంది. ఈ వంతెనకు సంబంధించిన స్లాబ్ పిల్లర్లు మాత్రం యధావిధిగా ఉన్నాయనీ, నిర్మాణ లోపంతోనే స్లాబ్ వేస్తుండగానే వంతెన కుప్ప కూలిపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. వంతెన కూలి పోయిన సమయంలో ఆ ప్రాంతంలో స్థానికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని విమర్శలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని ఐదు సివిల్ ప్యాకేజీలుగా విభజించారు, ప్యాకేజీ-1ని అమలు చేసే బాధ్యత ఢిల్లీలో ఉన్న HG ఇన్ఫ్రా ఇంజనీరింగ్తో ఉంది. ఈ సంస్థ గంగా ఎక్స్ప్రెస్వే అభివృద్ధి కోసం అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది.