ఆగస్ట్ 1న భార్యా బాధితుల సంఘం సమావేశం.. ప్రభుత్వానికి తెలిపేలా...
ఆ రోజు ఉదయం 9 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత భార్య బాధితుల సంఘం సమావేశం జరుగుతుందని, ఈ సందర్భంగా కోర్ కమిటీ వేసి డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ : భారత భార్య బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1న సమావేశం జరగనుంది. ఈ మేరకు సమావేశంనిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షులు జి బాలాజీ రెడ్డి తెలిపారు.
ఆ రోజు ఉదయం 9 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత భార్య బాధితుల సంఘం సమావేశం జరుగుతుందని, ఈ సందర్భంగా కోర్ కమిటీ వేసి డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
భార్యా బాధితులు సమావేశానికి హాజరై అనుభవిస్తున్న బాధలు, ఆవేదనలు ప్రభుత్వానికి, పార్లమెంటుకు తెలియజేయడానికి సహకరించాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు 709343730 నెంబర్ లో సంప్రదించాలని బాలాజీ రెడ్డి కోరారు.