Asianet News TeluguAsianet News Telugu

భద్రాచలంలో బెంగళూరువాసి దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రంలోని నార్త్‌ బెంగుళూరు కుండలహల్లి గేట్‌ సమీపంలోని గుల్మోహర్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డులో ఉన్న 301 ఎఎన్‌ఎ్‌స హోమ్స్‌లో అతడు నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.

benguluru man murdered in Bhadrachalam
Author
Hyderabad, First Published Dec 20, 2019, 10:07 AM IST

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి... భద్రాచలంలో దారుణ హత్యకు గురయ్యాడు.  భద్రాచంలోని గోదావరి నదీ తీరంలో ఆయన మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి గోదావరి తీరంలో అతనిని గుర్తు తెలియిని వ్యక్తులు ఎవరో హత్య చేశారు.

ఈ క్రమంలో భద్రాచలం పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోవడంతో ఆధార్‌ వేలిముద్ర నమోదుతో హత్యకు గురైన వ్యక్తి వివరాలు సేకరించారు. ఆ వివరాల ప్రకారం అతడి పేరు అశ్వత్థామయ్యగా గుర్తించారు.
 
కర్ణాటక రాష్ట్రంలోని నార్త్‌ బెంగుళూరు కుండలహల్లి గేట్‌ సమీపంలోని గుల్మోహర్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డులో ఉన్న 301 ఎఎన్‌ఎ్‌స హోమ్స్‌లో అతడు నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై భద్రాచలం సీఐ వినోద్‌రెడ్డి కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. 

దేశంలోని వివిధ పు ణ్యక్షేత్రాలను సందర్శించే అలవాటు ఉన్న అశ్వత్థామయ్య ఈ క్రమంలోనే భద్రాచలం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతడిని ఎ వరు హత్య చేశారు. ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios