Asianet News TeluguAsianet News Telugu

మధిరలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ పై దాడి: ఫ్లెక్సీల చించివేత

ఉమ్మడి  ఖమ్మం  జిల్లాలోని  మధిరలో  మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కార్యాలయంపై  ఇవాళ  గుర్తు తెలియని దుండగులు దాడి  చేశారు. 

Attacked  on ponguleti srinivas reddy office  in  Madhira  lns
Author
First Published May 28, 2023, 2:45 PM IST

ఖమ్మం: ఉమ్మడి  ఖమ్మం  జిల్లాలోని  మధిరలో  ఆదివారంనాడు  మాజీ ఎంపీ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కార్యాలయంపై  గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కార్యాలయం  ముందు  ఏర్పాటు  చేసిన  ఫ్లెక్సీని  చింపివేశారు.  మరో వైపు   కార్యాలయంలోని  పూలకుండీలను  ధ్వంసం  చేశారు. ఈ సమయంలో  ఈ కార్యాలయంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు  ఎవరూ  ఈ కార్యాలయంలో  లేరు.

మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ పై  సోషల్ మీడియాలో  అనుచిత వ్యాఖ్యలు  చేశారని  ఆరోపిస్తూ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  అనుచరుడిపై  ఖమ్మంలో    బీఆర్ఎస్  శ్రేణులు  దాడికి దిగారు. మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి   గత కొంతకాలంగా  బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు  చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో  ఖమ్మం  జిల్లాలో  ఒక్క సీటు కూడా రాకుండా  తన శక్తివంచన లేకుండా కృషి  చేస్తానని ప్రకటించారు.  మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ పై  కూడా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  విమర్శలు  చేశారు.  పువ్వాడ అజయ్ కుమార్ కూడా  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై  విమర్శలు  చేశారు. 

మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి ని బీజేపీ, కాంగ్రెస్ లలో  చేరాలని  ఆ పార్టీలు  ప్రయత్నిస్తున్నాయి.  అయితే  ఈ రెండు  పార్టీల్లో  ఏ పార్టీలో  చేరే విషయమై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఇంకా స్పష్టత  ఇవ్వలేదు.  కానీ  ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో 
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తన అనుచరులతో  సమావేశాలు  నిర్వహిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios