Asianet News TeluguAsianet News Telugu

నిరుపేద మహిళకు పురుడు పోసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ..

అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఓ నిరుపేద మహిళకు పురుడు పోశారు. క్లిష్టమైన ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు.

Achampet MLA vamshi krishna done Cesarean section to a poor woman - bsb
Author
First Published Jan 13, 2024, 11:24 AM IST

అచ్చంపేట : అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మానవత్వాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అయినా వృత్తి ధర్మాన్ని వీడలేదు. ఓ నిరుపేద మహిళకు సిజేరియన్ చేసి తల్లిబిడ్డల ప్రాణాలు కాపాడారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామానికి చెందిన ప్రసన్న  అనే మహిళకు 9 నెలలు నిండినా డెలివరీ అవ్వలేదు. 

దీంతో బంధువులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని తెలిపారు. ఏం చేయాలో పాలుపోనీ ఆ కుటుంబ సభ్యులు  శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిశారు. తమ సమస్యను చెప్పి వేడుకున్నారు. వెంటనే స్పందించిన వంశీకృష్ణ వెంటనే హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అక్కడున్న వైద్యులతో కలిసి ఆ మహిళకు సిజేరియన్ చేశారు.  

ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ డాక్టర్. సర్జన్ గా ఆయనకు మంచి పేరుంది. ఎమ్మెల్యే కాకముందు హైదరాబాద్, అచ్చంపేట,  కల్వకుర్తిలలో  ప్రాక్టీస్ కూడా చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios