Asianet News TeluguAsianet News Telugu

కబడ్డీ పోటీల్లో అపశృతి: సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ, 60 మందికి గాయాలు

 సూర్యాపేటలో  సోమవారం నాడు ప్రమాదం చోటు చేసుకొంది. 47వ, జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమైన ఆరు నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకొంది
 

60  got injures after gallary collapsed in Suryapeta lns
Author
Suryapet, First Published Mar 22, 2021, 7:21 PM IST

సూర్యాపేట:  సూర్యాపేటలో  సోమవారం నాడు ప్రమాదం చోటు చేసుకొంది. 47వ, జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమైన ఆరు నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకొంది. కబడ్డీ పోటీల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. .ఈ ప్రమాదంలో 60 మంది గాయాలయ్యాయి.

సోమవారం నాడు జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు సూర్యాపేటలో ప్రారంభమయ్యాయి.ఈ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మూడో నెంబర్ గ్యాలరీ కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీలో 1500 మంది ప్రేక్షకులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన 20 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

కబడ్డీ పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకొంది. గ్యాలరీ కూలిపోవడంతో కొందరికి ఇనుప చువ్వలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడినట్టుగా చెబుతున్నారు. రెయిలింగ్ కింద  కొందరు ప్రేక్షకులు చిక్కుకొన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రెయిలింగ్ పై సామర్ధ్యం కంటే కూర్చోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. నాలుగు వైపులా  15 వేల మంది కూర్చొని ఆటలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తూర్పువైపున ఉన్న గ్యాలరీపై సామర్ధ్యం కంటే ఎక్కువ మంది కూర్చోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios