రిమ్మనగూడ వద్ద రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా వర్గల్ మండలం పాములపర్తికి చెందినవారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద టాటా ఏస్ , లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వర్గల్ మండలంలోని పాములపర్తి వాసులుగా గుర్తించారు.
ఈ ఘటనలో గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 20 మంది టాటా ఏస్ వాహనంలో నాగపూర్ గ్రామంలో చావుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఆటోను వెనుక నుండి ఢీకొట్టింది.దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.