హైదరాబాద్లో హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో కారు కింద పడి రెండున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు
హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో కారు కింద పడి రెండున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు రివర్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారి తల్లి అక్కడికి దగ్గరలో గుంత తీసేందుకు కూలి పన్ను వచ్చింది. దీంతో బిడ్డను సెల్లార్లో పడుకోబెట్టింది. ఇదే సమయంలో చిన్నారి పడుకున్న విషయాన్ని చూసుకోకుండా కారు రివర్స్ చేయడంతో దారుణం జరిగింది. విగత జీవిగా పడివున్న బిడ్డను చూసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

