Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌కు మరో దిగ్గజం .. త్వరలో ‘Oppo’ డెవలెప్‌మెంట్ సెంటర్.. భారత్‌లోనే మొదటిది

ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరో దిగ్గజ కంపెనీ తరలిరానుంది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో హైదరాబాద్‌లో ఆర్&డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 

oppo to set up first development center in hyderabad
Author
Hyderabad, First Published Oct 3, 2018, 10:28 AM IST

ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరో దిగ్గజ కంపెనీ తరలిరానుంది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో హైదరాబాద్‌లో ఆర్&డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇది భారత్‌లో తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్. భారత్‌లోని వినియోగదారులకు ప్రత్యేకమైన టెక్నాలజీని అందించాలన్న లక్ష్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పో ఇండియా ప్రెసిడెంట్‌ చార్లెస్ వాంగ్ తెలిపారు.

సరికొత్త సాంకేతికతతో భారతీయులకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఈ డెవలప్‌మెంట్ సెంటర్ ‌అత్యంత కీలకంగా వ్యవహరించనుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఒప్పోకు చైనా, జపాన్, అమెరికాల్లో మొత్తం ఆరు ఆర్&డీ సెంటర్లు వుండగా... హైదరాబాద్‌లో ఏడాది నెలకొల్పుతున్నట్లు ఆయన తెలిపారు.

చైనా తర్వాత రెండో అతిపెద్ద పరిశోధనా కేంద్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు వాంగ్ స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, మరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios