వీఐవై-ఫై కాలింగ్ సర్వీస్ మహారాష్ట్ర & గోవా, కోల్కతా రెండు సర్కిల్లలో మాత్రమే అందుబాటులో ఉంది. తరువాత దశలవారీగా ఇతర సర్కిల్లలో ఈ సేవను ప్రారంభించే అవకాశం ఉంది.
న్యూ ఢీల్లీ: వొడాఫోన్ ఐడియా మంగళవారం డిసెంబర్ 15న భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వై-ఫై కాలింగ్’ లేదా ‘వీఐవై-ఫై’ సేవను ప్రారంభించింది.
వీఐవై-ఫై కాలింగ్ సర్వీస్ మహారాష్ట్ర & గోవా, కోల్కతా రెండు సర్కిల్లలో మాత్రమే అందుబాటులో ఉంది. తరువాత దశలవారీగా ఇతర సర్కిల్లలో ఈ సేవను ప్రారంభించే అవకాశం ఉంది.
రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ రెండు టెల్కోలు ఏడాది క్రితమే వై-ఫై కాలింగ్ సేవలను ప్రారంభించాయి. ఒక నివేదిక ప్రకారం వీఐవై-ఫై కాలింగ్ ప్రారంభాన్ని ట్విట్టర్ ద్వారా కంపెనీ కస్టమర్ సపోర్ట్ బృందం ధృవీకరించింది.
డిసెంబర్ 2019లో లాంచ్ చేసిన ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్ లాగానే వీఐవై-ఫై సర్వీస్ పోలి ఉంటుంది. వొడాఫోన్ ఐడియా గత కొంతకాలంగా వై-ఫై కాలింగ్ సేవను పరీక్షిస్తోంది. అయితే వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ విలీనం కారణంగా వీఐవై-ఫై సర్వీస్ వాయిదా పడింది.
ఈ కొత్త సర్వీస్ ఉపయోగం ఏంటంటే వినియోగదారులకు నెట్వర్క్ రద్దీ ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు వై-ఫై కాలింగ్కు మారడానికి అనుమతిస్తుంది. వై-ఫై ద్వారా వాయిస్ కాలింగ్ సపోర్ట్ జోడించడానికి వినియోగదారులు హ్యాండ్సెట్లో సాఫ్ట్వేర్ అప్ డేట్ అవసరం కావచ్చు.
వీఐ కొత్త రీఛార్జ్ ప్లాన్లు
కొత్త వై-ఫై కాలింగ్ సర్వీస్ రోల్ అవుట్తో పాటు వీఐ రూ.59, రూ. 65 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. కొత్త ప్లాన్లు మొదట గుజరాత్తో పాటు మహారాష్ట్ర, గోవా సర్కిల్ల కోసం మైవి.ఇన్ సైట్లో జాబితా చేసింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 16, 2020, 11:11 PM IST