Asianet News TeluguAsianet News Telugu

త్వరలో ఇండియాలోకి పబ్-జితో పాటు రీఎంట్రీ ఇవ్వనున్న టిక్ టాక్.. ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా హామీ..

భారతదేశంలో 2వేల మందికి పైగా ఉద్యోగులున్న బైట్  డాన్స్ సంస్థ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు బైట్  డాన్స్ ఇండియా సంస్థలోని ఏ ఉద్యోగిని కూడా తొలగించలేదు. కొన్నినివేదికల ప్రకారం బైట్  డాన్స్ ఉద్యోగులు ఈ సంవత్సరం  బోనస్ కూడా అందుకున్నారు. 

TikTok hopes to return to India soon as PUBG makes a comeback statement
Author
Hyderabad, First Published Nov 16, 2020, 6:43 PM IST

భారత ప్రభుత్వం గతనెలలో 57 చైనా యాప్‌లతో పాటు బైట్  డాన్స్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ టిక్ టాక్ ను నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. తరువాత పబ్-జితో సహ మరో  117 చైనీస్ యాప్ లను కూడా నిషేధించింది.

తాజాగా  పబ్-జి భారతశంలోకి తిరిగి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో టిక్ టాక్ కూడా ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

భారతదేశంలో 2వేల మందికి పైగా ఉద్యోగులున్న బైట్  డాన్స్ సంస్థ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు బైట్  డాన్స్ ఇండియా సంస్థలోని ఏ ఉద్యోగిని కూడా తొలగించలేదు. కొన్నినివేదికల ప్రకారం బైట్  డాన్స్ ఉద్యోగులు ఈ సంవత్సరం  బోనస్ కూడా అందుకున్నారు.

టిక్ టాక్ ఇండియా అధినేత నిఖిల్ గాంధీ ఉద్యోగులకు ఒక ఇమెయిల్ ద్వారా హామీ ఇచ్చారు, బైట్  డాన్స్ కంపెనీ తిరిగి ఇండియాలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం లేవనెత్తిన సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని తెలిపారు.

"మా వేదికలు సమాజంపై కలిగించే సానుకూల ప్రభావానికి మేము కట్టుబడి ఉన్నాము. మా ఉద్యోగులు మా వ్యాపారంలో కీలకం. మా ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిపరమైన శ్రేయస్సుపై మేము చాలా ప్రాముఖ్యతనిస్తున్నాము "అని నిఖిల్ గాంధీ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో  పేర్కొన్నారు.

also read మీరు రెడ్‌మి ఫోన్లలో ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్తా లేదంటే.. ...

స్థానిక చట్టాలు, భద్రతా అవసరాలకు అనుగుణంగా కంపెనీ పూర్తిగా కట్టుబడి ఉందని నిఖిల్ గాంధీ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలియజేశారు.  

"డేటా గోప్యత, భద్రతా అవసరాలతో సహా స్థానిక చట్టాలకు లోబడి ఉండటానికి మేము నిబద్ధతను ప్రదర్శించాము, అందువల్ల సానుకూల ఫలితం కోసం ఆశాజనకంగా ఉన్నాము. మా స్పష్టీకరణలు ప్రభుత్వానికి సమర్పించాము, వారికి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే మేము వాటిని కూడా పరిష్కరిస్తాము.

మా ప్లాట్‌ఫాం ద్వారా గుర్తింపును మాత్రమే కాకుండా జీవనోపాధికి కొత్త మార్గాలను కనుగొన్న మా వినియోగదారులకు, క్రియేటివ్లకు మేము అంకితభావంతో ఉన్నాము ”అని నిఖిల్ గాంధీ ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

టిక్‌టాక్ అతిపెద్ద యూసర్లు కసిగిన దేశాలలో భారతదేశంలో ఒకటి. గాల్వన్ లోయలో భారతదేశం - చైనా ఘర్షణ నేపథ్యంలో టిక్ టాక్ నిషేధించబడింది. అయితే ఇప్పుడు టిక్‌టాక్ చైనాతో సంబంధాలను  వదిలించుకోగలిగితే, త్వరలో భారతదేశానికి తిరిగి రావచ్చు.

తాజాగా పబ్-జి ఇండియాలోకి తిరిగి రావడాన్ని ప్రకటించడం ద్వారా భారతీయ పబ్-జి గేమర్లను సంతోషపరిచింది. పబ్-జి కార్పొరేషన్ అధికారికంగా పబ్-జి మొబైల్ ఇండియా కొత్త వెర్షన్ ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

లోకల్ వీడియో గేమ్, ఈస్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఐటి పరిశ్రమలలో 100 మిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టాలని పబ్-జి కార్పొరేషన్ యోచిస్తోంది. ఈ పెట్టుబడులు కొరియా సంస్థ అతిపెద్ద పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

భారతదేశంలో ఎక్స్ క్లుసివ్ ఈస్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడం ద్వారా పెట్టుబడులు పెట్టాలని కంపెనీ యోచిస్తున్నట్లు పబ్-జి ఒక ప్రకటనలో తెలిపింది .

Follow Us:
Download App:
  • android
  • ios