డివైజెస్ అండ్ మొబిలిటీ కోసం రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ మాట్లాడుతూ బడ్జెట్ డివైజెస్ అందించాల్సిన అవసరం ఉందని, తద్వారా 2జి హ్యాండ్సెట్లను ఉపయోగిస్తున్న వారు 4జి ఇంకా 5జికి అప్గ్రేడ్ కావచ్చు.
న్యూ ఢీల్లీ: 4జి హ్యాండ్సెట్లు, ఇతర డివైజెస్ ధరలను మరింత తగ్గించడానికి రిలయన్స్ జియో రియల్మీ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
డివైజెస్ అండ్ మొబిలిటీ కోసం రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ మాట్లాడుతూ బడ్జెట్ డివైజెస్ అందించాల్సిన అవసరం ఉందని, తద్వారా 2జి హ్యాండ్సెట్లను ఉపయోగిస్తున్న వారు 4జి ఇంకా 5జికి అప్గ్రేడ్ కావచ్చు.
ఒక సంస్థగా రిలయన్స్, మేము గతంలో 4జి కోసం జియోఫోన్ల ద్వారా కనెక్టివిటీ ప్రయోజనాలు చాలా సరసమైనవి చేసాము. ఇతర 4జి డివైజెస్ లో మేము రియల్మీ, ఇతర సంస్థలతో కలిసి డివైజెస్ ప్రజలకు మరింత సరసమైనదిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము" అని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020లో అన్నారు.
జియో మొబైల్ ఫోన్ విభాగంలో మాత్రమే కాకుండా ఇతర కనెక్ట్ డివైజెస్ కోసం కూడా పనిచేస్తుందని ఆయన అన్నారు.
also read ఫేస్బుక్ ని ఓడించి అధ్యధిక డౌన్లోడ్లతో నంబర్ 1గా టిక్ టాక్.. 2020లో టాప్ 10 యాప్స్ ఇవే ? ...
రియల్మీ సీఈఓ మాధవ్ శేత్ మాట్లాడుతూ భవిష్యత్తులో 5జీ స్మార్ట్ఫోన్లకే పరిమితం కానీ కొత్త ఆవిష్కరణలకు చాలా అవకాశాలను తెరుస్తుంది. 5జి ఫోన్లను గరిష్ట సంఖ్యలో తీసుకురావడంలో చిప్సెట్లు ముఖ్య పాత్ర పోషించాయని ఆయన అన్నారు.
చీప్ సెట్ల తయారీ సంస్థ మీడియాటెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకు జైన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో కంపెనీ డిజిటల్ టెక్నాలజీని బలంగా స్వీకరించింది.
రానున్న రోజుల్లో 5జీ సహాయంతో కృతిమ మేధ, రోబోలు, డ్రోన్లు, ఆటోమెటిక్ వాహనాలు వంటి సాంకేతిక విప్లవం రాబోతుందని తెలిపారు. 2021 వరకు భారత దేశంలో 5జీ సేవలు అందబోతున్నాయని, దానికి అనుగుణంగా సాంకేతికతతో కూడిన సెల్ఫోన్ పరికరాలను తయారు చేస్తామని" అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 14, 2020, 11:15 PM IST