Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ గేమర్ల కోసం అతిపెద్ద ఆన్‌లైన్-గేమింగ్‌ టోర్నమెంట్ ప్రారంభం.. యూట్యూబ్‌ ద్వారా లైవ్..

జియో, మీడియాటెక్ తో కలిసి భారతదేశంలో కొత్త, ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకొని ఈ‌స్పొర్ట్స్ ఈవెంట్ ‘గేమింగ్ మాస్టర్స్’ ప్రారంభించనుంది.

jio and mediatek to begin 2021 with biggest online gaming tournament on jio platform gaming masters
Author
Hyderabad, First Published Dec 30, 2020, 2:49 PM IST

ముంబై, 29 డిసెంబర్ 2020: దేశీయ టెలికాం దిగ్గజం జియో, తైవాన్ చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీడియాటెక్ తో కలిసి భారతదేశంలో కొత్త, ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకొని ఈ‌స్పొర్ట్స్ ఈవెంట్ ‘గేమింగ్ మాస్టర్స్’ ప్రారంభించనుంది.

మొట్టమొదటి ఆన్‌లైన్ గేమింగ్ ఈవెంట్ - ‘ఇండియా కా గేమింగ్ ఛాంపియన్’ ను జియోగేమ్స్ విజయవంతంగా పూర్తయిన కొద్ది రోజులకే ఈ 70 రోజుల ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ రాబోతుంది.

గేమింగ్ మాస్టర్స్ గురించి:  గేమింగ్ మాస్టర్స్ అనేది మీడియాటెక్, జియో చేత సాధారణ గేమర్లను కీలక గేమర్లుగా పరిగణించే సంస్థ, ఇది ఒక విప్లవాత్మకమైన ఆన్‌లైన్ గేమింగ్. 

వర్చువల్ గేమింగ్ రంగంలో గేమర్ల  స్కిల్స్, జట్టు కృషి, ఓర్పును పరీక్షించడానికి ఈ టోర్నమెంట్ సెట్ చేయబడింది, ఇందుకు రూ.12,50,000 బహుమతి కూడా ఇవ్వనుంది. మొత్తం టోర్నమెంట్ జియో టి‌వి హెచ్‌డి ఈస్పోర్ట్స్ ఛానల్ అలాగే యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

గేమింగ్ మాస్టర్స్ గారెనా స్వీయ-అభివృద్ధి చెందిన హిట్ బాటిల్ రాయల్ టైటిల్, ఫ్రీ ఫైర్ కలిగి ఉంటుంది. దీనిని జియో గేమ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జియో, నాన్-జియో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

ముఖ్యమైన తేదీలు: రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 29 డిసెంబర్ 2020  నుండి  9 జనవరి 2021 వరకు 

టోర్నమెంట్ తేదీలు: 13 జనవరి 2021 నుండి  7 మార్చి 2021 వరకు 

రిజిస్ట్రేషన్ కోసం : https://play.jiogames.com/esports లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జియో లేదా నాన్ జియో వినియోగదారులకు ఈ రిజిస్ట్రేషన్లు ఓపెన్ గా ఉంటాయి.

దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదా పాల్గొంటున్నందుకు ఫీజు లేదు మరింత సమాచారం కోసం https://i.mediatek.com/free-fire-gaming-master-Jioesport లో చూడవచ్చు
 

Follow Us:
Download App:
  • android
  • ios