Asianet News TeluguAsianet News Telugu

మొబైల్ సేవల ధరల పెంపు తప్పదు..: నెలకు 1.6 జీబీ మాత్రమే..

తక్కువ డేటా ధరలు టెలికాం పరిశ్రమ నిలదొక్కుకోనివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో ప్రస్తుతం రూ.160కే నెలకు 16 జీబీ లభిస్తుండటం దారుణమన్నారు. "మీరు నెలకు 1.6 జిబి సామర్థ్యాన్ని వినియోగానికి అలవాటు పడాలి లేదా మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే  చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాలి" అని మిట్టల్ వ్యాఖ్యానించారు. 

2dollars for 16 GB data not sustainable': Sunil Mittal says mobile services rate may  hike
Author
Hyderabad, First Published Aug 25, 2020, 4:58 PM IST

న్యూ ఢీల్లీ: రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరల పెరుగుదలపై భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సోమవారం సూచించారు. తక్కువ డేటా ధరలు టెలికాం పరిశ్రమ నిలదొక్కుకోనివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్‌లో ప్రస్తుతం రూ.160కే నెలకు 16 జీబీ లభిస్తుండటం దారుణమన్నారు. "మీరు నెలకు 1.6 జిబి సామర్థ్యాన్ని వినియోగానికి అలవాటు పడాలి లేదా మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే  చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాలి" అని మిట్టల్ వ్యాఖ్యానించారు.

యుఎస్ లేదా యూరప్ వంటి దేశాల మాదిరిగా 50-60 డాలర్లను మేము కోరుకోవడం లేదు, కాని ఖచ్చితంగా నెలకు 16జిబికి 2 డాలర్లు నిలకడగా ఉండవు "అని మిట్టల్ ఒక కార్యక్రమంలో అన్నారు. డిజిటల్ కంటెంట్ వినియోగంపై ఆరు నెలల్లో సగటున ప్రతి వినియోగదారుడి రెవెన్యూ (ఏ‌ఆర్‌పి‌యూ) రూ.200 దాటవచ్చని మిట్టల్ చెప్పారు.

also read అతిపెద్ద 7000mAh బ్యాట‌రీతో వ‌స్తున్న శాంసంగ్ కొత్త ఫోన్‌.. ఫీచర్లు లీక్.. ...

ఏ‌ఆర్‌పి‌యూ అనేది యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. "మాకు  రూ.300 ARPU అవసరం, దీనిలో మీకు డేటా నెలకు రూ. 100 సరిపోతుంది. కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి  అవసరం ఉంది ”అని భారల్ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా మిట్టల్ చెప్పారు.

జూన్ 30, 2020తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఏ‌ఆర్‌పి‌యూ రూ.157 కు పెరిగినట్లు నివేదించింది. 2019 డిసెంబర్‌లో భారతి ఎయిర్‌టెల్ సుంకం పెంచిన తరువాత ఏ‌ఆర్‌పి‌యూలో పెరుగుదల వచ్చింది. టెలికాం ఆపరేటర్లు కష్ట సమయాల్లో దేశానికి సేవలు అందించినప్పటికీ 5జి, ఎక్కువ ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని మిట్టల్ చెప్పారు.

టెలికాం వ్యాపారాలు కూడా డిజిటల్‌ను అవలంబించాల్సిన అవసరం ఉంది. పరిశ్రమ స్థిరంగా ఉండటానికి రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250  మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios