Asianet News TeluguAsianet News Telugu

కార్తీక శుద్ధ ద్వాదశి - తులసి నారాయణ పూజా విధానము

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి, అలికి బియ్యపు పిండితో గాని రంగుల చూర్ణములతో గాని ముగ్గులుపెట్టి దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.

Tulasi Narayana Puja on Karthika dwadasi
Author
Hyderabad, First Published Nov 16, 2021, 4:45 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


" కార్తీక శుద్ధ ద్వాదశి " ని క్షీరాబ్ది ద్వాదశి అందురు. దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మికి శ్రీ మన్నారాయుణునికి వివాహము చేస్తారు.
వ్రత పూజా విధానము :- ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి, అలికి బియ్యపు పిండితో గాని రంగుల చూర్ణములతో గాని ముగ్గులుపెట్టి దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని మరీ పల్లముగా గాని ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి ,కుంకుమతో బొట్టు పెట్టి వరిపిండి (బియ్యపు పిండి )తో ముగ్గు వేయాలి. సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. ఈ రోజున ( క్షీరాబ్ది ద్వాదశి ) పద్మమును, శంఖమును, చక్ర, పాదములు కూడా అలంకరించవలెను. పూజ చేసే వారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో విష్వక్సేనుని తయారు చేసి పసుపును సుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో గాని కొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు వేసి అందులో పసుపు విష్వక్సేనుని పెట్టి  విష్వక్సేన అర్చన షోడశోపచారాలతో అర్చన చేయాలి. ఆయన అనుజ్ఞ తీసుకొని. పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము :- దీపారాధన చేయుటకు కుంది ( ప్రమిద ) వెండిది గాని ఇత్తడిది గాని మట్టిది గాని వాడవచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి ( మధ్యలో )వేసి నూనెతో తడపవలెను . ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏక హారతిలో ( కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏకహారతి లో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభ వత్తి వెలిగించవలెను. తరువాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె గాని ఆవు నెయ్యి గాని వాడవచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.

ఘంటా నాదము :- శ్లో.  ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
                     కుర్యాద్ఘంటార వం తత్ర దేవతా హ్వాహాన లాంచనమ్
మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను. క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపదానము అతి ముఖ్య మైనది. ఆ రోజు దీపదానము చేయువారు స్వర్గ ప్రాప్తిని పొందుదురు. దీపమునకు ఆవు నెయ్యి ఉపయోగించ వలెను అది దొరకనిచో మంచి నూనె వాడవచ్చును. ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు మోక్ష ప్రాప్తి కలుగును.

పూజకు కావలసిన వస్తువులు :- లక్ష్మీ నారాయణుల యొక్క బొమ్మ ( ప్రతిమ ) ( తమ శక్తి కొలది బంగారముతో నైనను వెండితో నైననూ లేక మట్టితో నైనను తీసుకొనవలెను ) లేదా చిత్ర పటము, కొబ్బరికాయలు, బెల్లము, ఖర్జూరము, చెరకు, పళ్ళు , పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి 
కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె, అగరువత్తులు, వస్త్ర, యజ్నోపవీతములు, ప్రత్యేక నివేదనకు పిండివంటలు మొదలగునవి. పిమ్మట యజమానులు ( పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం 
చేయాలి. 
1  ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను. ఆ తర్వాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి 
.10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 .  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 ఓం హరయే నమః
24 . ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను. ఆచమనము అయిన తరువాత కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
  యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్య:-
ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

సంకల్పము :- హరిహోం శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్త మనస్య అద్య బ్రాహ్మణః ( ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ వెంకటాచల ఉత్తరప్రదేశే ( మనకు శ్రీ వెంకటాచలం ప్రధాన క్షేత్రము కావున మనము తిరుపతికి ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ) కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే ( మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ) శోభన గృహే ( అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు  సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ) సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహావిష్ణు ముద్దిశ్య శ్రీ మహావిష్ణు ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని ) క్షీరాబ్ధి శయన వ్రతాభ్యాం కర్మ కరిష్యే . సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా  ఆవాహనాది షోడశోపచార సహిత తులసీ ధాత్రి లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాదనను చేయవలెను.


కలశ పూజను గూర్చిన వివరణ :- వెండి, రాగి , లేక , కంచు గ్లాసులు ( లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు 
చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు  వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి. ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
      మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
      ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
      అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
   కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య  (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) ,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,ఆకుతో గాని చల్లాలి .

మార్జనము :- ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
                 యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :|| అని పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణ 
ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు .

మొదట విష్వక్సేన పూజ చేయాలి.

షోడశోపచార పూజను చేయవలెను. షోడశోప చారములనగా ఆవాహన ,ఆసనం, అర్ఘ్యం ,పాద్యం, ఆచమనీయం ,స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం ,ప్రదక్షణములు మొదలగునవి.

నారాయణ   షోడశోపచార పూజా ప్రారంభః

ధ్యానం :-
శ్లో || దక్షిణాగ్ర కరే శంఖం పద్మంత స్వాప్యదః కరే
   చక్ర మూర్ధ్వ కరే నామే గదాంత స్యాయ్సదః కరే
   దదానాం సర్వ లోకేశం సర్వా భరణ భూషితం
    క్షీరాబ్ధి శాయనం దేవం ధ్యాయేన్నారాయణ ప్రభుం
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ధ్యాయామి -ధ్యానం సమర్పయామి అని విష్ణువును మనస్సున ధ్యానించినమస్కరించవలెను.

ఆవాహనం :-
శ్లో || ఆవాహయామి దేవత్వం పూజార్ధ మిహహే ప్రభో |
     ఆగచ్ఛ దేవ దేవేశ సర్వ దేవ గణై స్సహ ||
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి. అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.

ఆసనం :-
శ్లో || అనేత హార సంయుక్తం నానామణి విరాజితం
  రత్న సింహాసనం దేవ ప్రీత్యర్ధ ప్రతి గృహ్యతాం ||
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం
 సమర్పయామి. సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను. 

అర్ఘ్యం :-
శ్లో || నిష్కళంక గుణా రాధ్య జగత్త్రితయ రక్షక
   అర్ఘ్యం గృహాణ మద్దత్తం శుద్దోదక వినిర్మితం
ఓం
 శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి .దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనసున తలుస్తూ ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

పాద్యం :-
శ్లో || పద్మనాభ సురారాధ్య పాదాంభుజ శుభ ప్రద
  పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం
ఓం
 శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పాదౌ : పాద్యం సమర్పయామి.దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను .

ఆచమనీయం :-
శ్లో|| సర్వ రాధ్య నమస్తేస్తు సంసారార్ణవ తారక
  గృహాణ దేవ మదత్తం పరమాచామనీయకం 
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్లిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.
సూచన :- అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగువాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరివేణంలోవదలరాదు.

మధుపర్కం :-

ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ ఈ మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను. ( ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకున్న దాన్ని మధుపర్కం అంటారు.)

పంచామృత స్నానం :-
శ్లో|| స్వపాద పద్మ సంభూత గంగా శోదిత విష్ణవ
పంచామృతై స్నాపయిష్యే తతః శుద్దోద కేనేచ
ఓం
 శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి .అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి , ఆవుపాలు ,ఆవు పెరుగు ,తేనె, పంచదార కలిపినా పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.

శుద్దోదక స్నానం :-
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

వస్త్ర యుగ్మం :-

శ్లో|| విర్యు వ్విలాస రమ్యేణ సర్వ వస్త్రేణ సంయతం
వస్త్ర యుగ్మం గృహణేదం భక్త్యా దత్తం మయా ప్రభో
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మ మనగా రెండు ) అనుచు వస్త్రమును ( ప్రత్తిని పెద్ద బొట్టు 
బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును.ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం :-
శ్లో || నారాయణ నమస్తేస్తు నాక నాధాధి పూజితం
  స్వర్ణో పవీతం మద్దతం స్వర్ణ దం ప్రతి గృహ్యాతాం
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను .ఇదియును పులుతో చేయవచ్చును. తులసితో చేయండి. దీనిని పురుష దేవతలు రాముడు కృషుడు. విష్ణువు ఆ అంశకు సంభంధం కలిగిన వారికి  పూజకు మాత్రమే 
సమర్పించ వలెను.

గంధం :-
శ్లో || రమాలింగన సంసక్త కాశ్మీర వక్షసే :
  కస్తూరి మిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః రమ్య గంధం సమర్పయామి. ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.

అక్షతలు :-
శ్లో || అక్షతాన్ ధవళాన్ శుభ్రాన్ పక్షి రాజ ధ్వజా వ్యయ
  గృహాణ దేవ దేవేశ కృపయా భక్త వత్సల
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను ) అక్షతలు తీసుకుని స్వామివారి ప్రతిమపై చల్లవలెను.

పుష్ప సమర్పణ :-
శ్లో || బిల్వపు దళ తులసీ దళ మల్లికాభి ,
  స్త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవః
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను. పిదప అధాంగ పూజను చేయవలెను. ఈ క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని ,పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.

అధాంగ పూజ :-పాదావనత కేశాయ నమః పాదౌ పూజయామి , నివృత్తిని మేషాది కాలాత్మనే నమః జంఘే పూజయామి ,విశ్వరూపాయ నమః జానునీ పూజయామి ,జగన్నాదాయనమః గుహ్యం పూజయామి , పద్మనాభాయ నమః నాభిం పూజయామి, కుక్షి స్థాకిల విష్టపాయ నమః కుక్షిం పూజయామి , లక్ష్మీ
 విలస ద్వక్షసే నమః వక్షః పూజయామి ,చక్రాది హస్తాయ నమః హస్తాన్ పూజయామి, కంబు కంటాయ నమః కంటం పూజయామి , చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి , వాచస్పతయే నమః వక్త్రం పూజయామి , కేశవాయ నమః నాసికం పూజయామి , నారాయణే నమః నేత్రౌ పూజయామి , గోవిందాయ నమః శ్రోత్రౌ పూజయామి, నిగమ శిరో గమ్యాయ నమః శిరః పూజయామి , సర్వేశ్వరాయ నమః సర్వాణ్యం గాని పూజయామి. తరువాత అష్టోత్తర శతనామావళి పూజ .దీని యందు 108 మంత్రములుండును. ఈ మంత్రములను చదువుచూ పుష్పములతో కాని ,పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను .

అష్టోత్తర శతనామావళి :-
ఓం విష్ణవే నమః ;
ఓం లక్ష్మీ పతయే నమః ;
ఓం కృష్ణాయ నమః ; 
ఓం వైకుంటాయ నమః ;
ఓం గరుడ ద్వజాయ నమః ;
ఓం పరబ్రహ్మణే నమః ;
ఓం జగన్నాదాయ నమః ;
ఓం వాసుదేవాయ నమః ;
ఓం త్రివిక్రమాయ నమః
; ఓం హంసాయ నమః ;
ఓం సమగ్ర మదనాయ నమః ;
ఓం హరయే నమః ;
ఓం శుభప్రదాయ నమః ; 
ఓం మాధవాయ నమః ;
ఓం పద్మనాభాయ నమః ; 
ఓం హృషీ కేశాయ నమః ;
ఓం సనాతనాయ నమః ;
ఓం నారాయణాయ నమః ;
ఓం మధు పతయే నమః ;
ఓం రతా రోక్ష్య వాహనాయ నమః ;
ఓం దైత్యాంత కాయ నమః ;
ఓం శింసుమారాయ నమః ;
ఓం శ్రీ కరాయ నమః ;
ఓం కపిలాయ నమః ;
ఓం పుండరీ కాక్షాయ నమః ;
ఓం స్థితి ప్రత్యై నమః ;
ఓం పరాత్పరాయ నమః ;
ఓం వనమాలినే నమః ; 
ఓం యజ్ఞ రూపాయ నమః ; 
ఓం చక్ర రూపాయ నమః ;
ఓం గదాధరాయ నమః ; 
ఓం ఉపేంద్రాయ నమః ; 
ఓం కేశవాయ నమః ; 
ఓం భూమజనకాయ నమః ;
ఓం శేష శాయినే నమః ;
ఓం చతుర్బుజాయ నమః ;
ఓం పాంచజన్య ధరాయ నమః ; 
ఓం శ్రీ మతే నమః ;
ఓం శార్ జ్ఞ పాణాయ నమః ;
ఓం జనార్ధనాయ నమః ; 
ఓం పీతాంబర ధరాయ నమః ; 
ఓం దేవాయ నమః ; 
ఓం సూర్య చంద్ర విలోచనాయ నమః ;
ఓం మత్స్య రూపాయ నమః ;
ఓం కూర్మ తనవే నమః ;
ఓం క్రోధరూపాయ నమః ; 
ఓం హృషీ కేశాయ నమః ; 
ఓం వామనాయ నమః ;
ఓం భార్గవాయ నమః ;
ఓం రామాయ నమః ; 
ఓం హలినే నమః ;
ఓం కల్కినే నమః ;
ఓం హరా ననాయ నమః ;
ఓం విశ్వంభరాయ నమః ;
ఓం ధృవాయ నమః ; 
ఓం దత్తాత్రేయాయ నమః ;
ఓం అచ్యుతాయ నమః ; 
ఓం అనంతాయ నమః ; 
ఓం రధ వాహనాయ నమః ;
ఓం ముకుందాయ నమః ; 
ఓం ధన్వంతరే నమః ; 
ఓం శ్రీనివాసాయ నమః ;
ఓం ప్రద్యుమ్నాయ నమః ;
ఓం పురుషోత్తమాయ నమః ;
ఓం శ్రీ వత్స కౌస్తుభ ధరాయ నమః ;
ఓం మురారాతయే నమః ;
ఓం అదోక్షజాయ నమః ; 
ఓం ఋషభాయ నమః ; 
ఓం మోహినీ రూపాయ నమః ;
ఓం ధరాయ నమః ; 
ఓం సంకర్షనాయ నమః ;
ఓం ప్రుధవే నమః ; 
ఓం క్షీరాబ్ది శాయినే నమః ;
ఓం భూతాత్మనే నమః ; 
ఓం అనిరుద్దాయ నమః ;
ఓం భక్త వత్సలాయ నమః ;
ఓం నారాయణాయ నమః ;
ఓం గజేంద్ర వరదాయ నమః ;
ఓం త్రిగ్దామ్నే నమః ;
ఓం సూర్య మండల మధ్యగాయ నమః ; 
ఓం సనకాది మునీ ధ్యేయాయ నమః ;
ఓం భగవాశతే నమః ;
ఓం శంకర ప్రియాయ నమః ;
ఓం వీర గందాయ నమః ;
ఓం ధరా కాంతాయ నమః ;
ఓం వేదాత్మనే నమః ;
ఓం బాదరాయ ణాయ నమః ;
ఓం భాగీ రదీ జన్మ భూమినే నమః ;
ఓం పాద పద్మాయ నమః ; 
ఓం సతాం ప్రభవే నమః ; 
ఓం స్వభవే నమః ; 
ఓం విభవే నమః ;
ఓం ఘన శ్యామాతవాసనే నమః ;
ఓం శ్వేత ద్వీప వానినేవ్యాయ నమః ; 
ఓం గోవిందాయ నమః ; 
ఓం బ్రహ్మ జనకాయ నమః ; 
ఓం కైటభాసుర మర్ధనాయ నమః ;
ఓం శ్రీధరాయ నమః ; 
ఓం కాయ ణమః ;
ఓం జగత్కార ణాయ నమః ;
ఓం అవ్యయాయ నమః ; 
ఓం దశావతారాయ నమః ;
ఓం శాంతాత్మనే నమః ; 
ఓం లీలా మానుష విగ్రహాయ నమః ;
ఓం దామొధరాయ నమః ; 
ఓం విరాట్ రూపాయా నమః ;
ఓం భూత భవ్య భవిత్రు భవనే నమః  

పిదప అగరువత్తిని వెలిగించి .......

ధూపం :-
శ్లో || దశాంగం గగ్గులో పేతం చంద నాగరు వాసితం
  ధూపం గృహాణ దేవేశ ధూర్జటి స్తుత సద్గుణ
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి. ధూపంసమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.

దీపం :-
శ్లో || అజ్ఞాన ద్వాంత నాశాయ అఖండా లోక శాలినే
  ఘ్రుతాకావర్తి సంయుక్త దీపం దాస్యామి శక్తితః
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో ఉన్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను .ధూప దీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి.

నైవెధ్యం:-
శ్లో || పృదు కానిక్షు ఖండాంశ్చ కదళీ ఫల సంయుతం
  దాపయిష్యే భవత్ప్రీ త్యై గృహాణ సురవందిత
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నైవెధ్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి స్వామివద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ' ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ,దీయో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన  పరిషించామి ,(ఋ తంత్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను ) అమృతమస్తు అమృతో పస్తరణమసి , ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరి ణెతో ) స్వామికి నివేదనం చూపించాలి .పిదప ఓం తులసీదాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నైవేద్యా నంతరం 'హస్తౌ ప్రక్షాళయామి ' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి .తరువాత 'పాదౌ ప్రక్షాళ యామి ' అని మరొకసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. పునః శుద్దాచ మనీయం సమర్పయామి. అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి. ఆ తర్వాత .. 

తాంబూలం :-
శ్లో || ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
  విస్తీర్ణ కర్పూరేణ సుశం మిశ్రమ తాంబూలం స్వీకురు ప్రభో
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు, రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి ) స్వామీ వద్ద ఉంచాలి .తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .పిమ్మట కర్పూరం వెలిగించి ...

నీరాజనం :-
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి మూడుమార్లు తిప్పుచూ చిన్నగా గంట వాయించవలెను. ఆ తర్వాత మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు ,పువ్వులు ,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని

మంత్రపుష్పం :-
శ్లో || పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యా దత్తా మిదం ప్రభో
   అనుగ్రహ హేణ మాం రక్ష దేవ దేవ దయానిధే
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః యధా శక్తి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు ,చిల్లర స్వామి 
వద్ద ఉంచవలెను . పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి .

ప్రదక్షిణం :-
శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సర్వ భ్రమ నివారణం
  సంసార సాగరాన్సాంత్వం ముద్దర స్వ మహాప్రభో

శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచ
  తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం
 శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మ ప్రదక్షణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట శ్రీ స్వామికి ,అమ్మవారికి (లక్ష్మీ నారాయణులకు) సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి ,ఆడువారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎడమకాలుపై వేసి )తరువాత స్వామిపై చేతిలో ఉన్న అక్షతలు పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ ...

పునః పూజ :- ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకొని పంచపాత్రలోని నీటిని చేతితో తాకి  అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను.

విశేషోపచారములు:-
 ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి ,నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి ,వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోప చార పూజాం సమర్పయామి అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.
పూజా ఫల సమర్పణమ్ :-

శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
   యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
   మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర |
   యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
   
అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ ....సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం శ్రీ .......ర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. ఆ తర్వాత  శ్రీ ......ప్రసాదం శిరసా గృహ్ణామి ' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను. ఆ తర్వాత పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు. పూజా విధాణం సంపూర్ణమ్

తీర్ధ ప్రాశనమ్ :-
శ్లో || అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్ |
  సమస్త పాపక్షయకరం శ్రీ .... పాదోదకం పావనం శుభమ్ || అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడు మార్లు నోటిలోనికి తీసుకొనవలెను . 

కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో విష్ణువును  తులసీ కోటను పూజించేవారికి ఈతిబాధలు తొలగి సకల సంతోషాలు చేకూరుతాయి జై శ్రీమన్నారాయణ.  


 

Follow Us:
Download App:
  • android
  • ios