Asianet News TeluguAsianet News Telugu

యూకేలో కేటీఆర్ బర్త్‌ డే వేడుకలు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను యూకేలో ఘనంగా నిర్వహించారు. 

trs nri wing conducts ktr birth day celebrations in uk
Author
UK, First Published Jul 25, 2019, 5:05 PM IST

లండన్:  ఎన్నారైల తెరాస యూకే ఆద్వర్యం లో లండన్ లో   టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. 

తొలుత కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై తెరాస అడ్వైజరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి  తొలుత కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ తరహాలో ప్రతి ఏటా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు జరుపుకోవాలని  ఆయన కోరుకొన్నారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన తర్వాత రాష్ట్రంలో నూతన ఉత్తేజం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు తెరాస వైపు చూస్తున్నారని, ఇటీవల ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వస్తున్న స్పందనే దానికి నిదర్శనమన్నారు.

కేటీఆర్ పిలుపు మేరకు "గిఫ్ట్ ఏ స్మైల్" లో భాగంగా తన సొంత గ్రామం పోచారం లో ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతుల ఉండేలా వ్యక్తిగత ఖర్చుతో పనులు చేయించడానికి శ్రీకారం చుట్టినట్టుగా సురేందర్ రెడి చెప్పారు.

 ఇక ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలలకి వెళ్లకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.  మంత్రిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్రానికి  కేటీఆర్ ఎంతో సేవ చేస్తున్నారని అందుకే ఆయన నాయకత్వాన్ని బలపర్చాలని సురేందర్ రెడ్డి కోరారు.

ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ కేటీఆర్ కు ఎన్నారై తెరాస పక్షాన యావత్  ఎన్నారైల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

కేటీఆర్ గతంలో మంత్రిగా ఉండి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం అసూయ పడే విధంగా తన బాధ్యతలు నిర్వహించారన్నారు. ప్రజలంతా గర్వపడేలా పనిచేసే నాయకుడు తెలంగాణలో ఉండడం తమ అదృష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన ఎన్ఆర్ఐలను కోరారు. 

ఇలా మేమంతా గర్వపడేలా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు తెలంగాణ లో ఉండడం మన అందరి అదృష్టమని, వారి పిలుపు మేరకు కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా స్థానికంగా మరియు తెలంగాణ రాష్ట్రం లో వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 

ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరై అన్ని సందర్భాలలో ప్రోత్సహాన్ని అందిస్తున్న ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు. 

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ యుకే ఆధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ రాష్ట్ర పురోభివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోభివృద్ది కృషి చేసి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి దిశగా తీసుకువచ్చారని కొనియాడారు. కేటీఆర్‌ను యువతరం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు.

ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తెలంగాణకు ఐటీ కంపెనీలు తెచ్చేందుకు కేటీఆర్‌ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  దొంతుల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి  రత్నాకర్ కడుదుల, సత్య చిలుముల సృజన్ రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకులు రోహిత్ రావు,  ముఖ్య నాయకులు రవి రేతినేని, శ్రీకాంత్ జెల్లా, సురేష్ బుడగం, గణేష్ పస్తం, నరేందర్, వాసు, రంజిత్ ఉన్నారు.

trs nri wing conducts ktr birth day celebrations in uk

trs nri wing conducts ktr birth day celebrations in uk

trs nri wing conducts ktr birth day celebrations in uk

 

Follow Us:
Download App:
  • android
  • ios