Asianet News TeluguAsianet News Telugu

మ్యారేజ్ డేకి ముందు విషాదం: అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

తెలుగు టెక్కీ మృదుల్ చెరుకుపల్లి ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో మరణించాడు. మ్యారేజీ డేకి ఒక రోజు ముందు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయనకు భార్య సుష్మ (27), కూతురు రాజశ్రీ (6) ఉన్నారు.

Telugu NRI dies tragically a day before his marriage anniversary
Author
Dallas, First Published Aug 22, 2018, 10:33 AM IST

డల్లాస్: తెలుగు టెక్కీ మృదుల్ చెరుకుపల్లి ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో మరణించాడు. మ్యారేజీ డేకి ఒక రోజు ముందు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయనకు భార్య సుష్మ (27), కూతురు రాజశ్రీ (6) ఉన్నారు. 

ఈ నెల 20వ తేదీన ఆయన తన ఎనిమిదో వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. మృదుల్ డల్లాస్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గుండెపోటుతో ఆయన మృత్యువాత పడ్డాడు. 

మృదుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందినవాడు. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఎన్నారై సంఘాలు, తెలుగు కమ్యూనిటీ కృషి చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios