Asianet News TeluguAsianet News Telugu

న్యూజెర్సీలో తెలంగాణ వాసి దుర్మరణం

డిసెంబర్‌ 22న న్యూజెర్సీలోని ఎడిసన్‌ టౌన్‌షిప్‌ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Telangana Youth Died Accidentally in US
Author
Hyderabad, First Published Dec 24, 2020, 8:32 AM IST

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ తెలంగాణ వాసి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవీణ్‌కుమార్‌ (37) అనే హన్మకొండ వాసి న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. కాగా.. అతను ప్రమాదవశాత్తు రైలు కింద పడి చనిపోయాడు.

 డిసెంబర్‌ 22న న్యూజెర్సీలోని ఎడిసన్‌ టౌన్‌షిప్‌ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రవీణ్‌ తండ్రి రాజమౌళి ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో డీఈగా రిటైర్‌ అయ్యారు.

ఆయనకు ముగ్గురు కుమారులు కాగా ప్రవీణ్‌కుమార్‌ చిన్నవాడు. రాజమౌళి స్వస్థలం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాల గ్రామం కాగా, భవానీనగర్‌లో స్థిరపడ్డారు. నాలుగేళ్లుగా భార్య నవతతో కలసి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్‌ మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ మృతదేహం ఆస్పత్రిలోనే ఉందని,  స్వదేశానికి రప్పించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వేడుకుంటున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొడుకు చనిపోయాడని తెలుసుకొని విలపిస్తున్న ప్రవీణ్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios