Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు...

తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగ  ఖడాంతరాలను దాటింది. ఉపాధి రిత్యా ఇతర దేశాల్లో స్థిరపడి సంక్రాంతికి సొంతూళ్లకు రాలేకపోయిన ప్రవాసులు కూడా తమ తమ ప్రాంతాల్లోనే ఈ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఇలాగ తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆద్వర్యంలో కార్డిఫ్ నగరంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంస్థ మొదటి వార్డికోత్సవంతో పాటు సంక్రాతి పండగ కలిసి రావడంతో రెండింటిని కలిపి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల్స్, ఇంగ్లాండ్ లలో నివాసముంటున్న తెలుగువారు పాల్గొన్నారు. 

sankranthi celebrations at england
Author
Wales, First Published Jan 21, 2019, 3:28 PM IST

తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగ  ఖడాంతరాలను దాటింది. ఉపాధి రిత్యా ఇతర దేశాల్లో స్థిరపడి సంక్రాంతికి సొంతూళ్లకు రాలేకపోయిన ప్రవాసులు కూడా తమ తమ ప్రాంతాల్లోనే ఈ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఇలాగ తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆద్వర్యంలో కార్డిఫ్ నగరంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంస్థ మొదటి వార్డికోత్సవంతో పాటు సంక్రాతి పండగ కలిసి రావడంతో రెండింటిని కలిపి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల్స్, ఇంగ్లాండ్ లలో నివాసముంటున్న తెలుగువారు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమాన్ని తెలుగు ప్రమఖులు వెలగపూడి బాపూజీ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపూజీ రావు మాట్లాడుతూ... తెలుగు ప్రజల ఐకమత్యం, స్ఫూర్తి ఇలాగే ఎప్పుడు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆద్వర్యంలో గతంలో నిర్వహించిన బాల దినోత్సవం, మహిళా దినోత్సవం, సంక్రాంతి , బోనాల జాతర వంటి కార్యక్రమాలను ఆయన అభినందించారు.  తెలుగు బాషా, సంస్కృతిని కాపాడటానికి ఈ సంస్థ సభ్యులు చేపట్టిన తెలుగు బడి కార్యక్రమం చాలా విశేషమైందన్నారు. ఈ సందర్భంిగా ఆయన తెలుగు అసోసియేషన్ సభ్యులను ఘనంగా సత్కరించారు.


ఆయన ప్రసంగం తర్వాత సంక్రాతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలుగింటి మహిళలు ముగ్గుల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే చిన్న పిల్లలపై భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పురుషులు, మహిళలతో పాటు చిన్నారులు ఉత్పాహంగా పాల్గొన్నారు.   

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి తెలుగు అసోసియేషన్ వారు తెలుగు వంటకాలతో ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎప్పుడూ పిజ్జాలు, బర్గర్లు తినే వారు ఈ విందుతో అమ్మ చేతి వంటను, సొంత ఊళ్లను గుర్తుచేసుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు , పచ్చళ్ళు మరియు స్వీట్స్‌లతో కూడిన విందును ప్రతీ ఒక్కరు సంతోషంగా ఆరగించారు.

చివరగా తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ సభ్యులు మాట్లాడుతూ... ఈ సంస్థ ఇదే స్ఫూర్తితో, అందరి సహాయ సహాకారాలతో ఇకపై కూడా ఇలాగే మంచి కార్యక్రమాలను  నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు.  తెలుగు వారే అత్యంత వైభవంగా జరుపుకునే తెలుగింటి పండగా సంక్రాంతిని అందరం కలిసి జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios