Asianet News TeluguAsianet News Telugu

అమెరికా: ఈతకు వెళ్లి హైదరాబాద్ యువకుడు గల్లంతు.. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం

అమెరికాలో తెలుగు యువకుడు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించాడు. హైదరాబాద్ మియాపూర్ జ‌న‌ప్రియ వెస్ట్‌సిటీలో పాఠ‌శాల విద్య అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ (రిటైర్డ్‌) శ్రీనివాస్‌రావు- ర‌మాదేవి దంప‌తుల కుమారుడు సాయి ప్ర‌వీణ్‌కుమార్ అమెరికాలోని ఆస్టిన్‌లో ఉంటూ అమెజాన్ కంపెనీలో ఆర్కిటెక్చ‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు

hyderabad man died in america ksp
Author
Hyderabad, First Published Jun 22, 2021, 6:50 PM IST

అమెరికాలో తెలుగు యువకుడు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించాడు. హైదరాబాద్ మియాపూర్ జ‌న‌ప్రియ వెస్ట్‌సిటీలో పాఠ‌శాల విద్య అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ (రిటైర్డ్‌) శ్రీనివాస్‌రావు- ర‌మాదేవి దంప‌తుల కుమారుడు సాయి ప్ర‌వీణ్‌కుమార్ అమెరికాలోని ఆస్టిన్‌లో ఉంటూ అమెజాన్ కంపెనీలో ఆర్కిటెక్చ‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ‌ఫిట్‌నెస్ మీద ఉన్న ఆసక్తితో సాయి ప్ర‌వీణ్ స్నేహితుల‌తో క‌ల‌సి స్థానికంగా ఒక చెరువు లో ఈతకు వెళ్లాడు.

Also Read:అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం.. కడసారి చూపుకై తల్లిదండ్రుల ఎదురుచూపు

పెడ‌ల్ బోటింగ్‌లో పాల్గొన్న సాయిప్ర‌వీణ్ చెరువు లోపలికి వెళ్లి అదృశ్య‌మ‌య్యాడు. దీంతో కంగారు పడిన అతని మిత్రులు అధికారులకు సమాచారం అందించడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల తర్వాత చెరువులో సాయి ప్రవీణ్ మృతదేహం లభించింది. అతని మరణవార్తను స్నేహితులు ప్రవీణ్ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతని పార్ధీవ దేహాన్ని మియాపూర్‌కు తీసుకువ‌స్తున్న‌ట్టు బంధువులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios