శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వారు ఈ విరాళాన్ని ఆలయానికి ఇచ్చారు. ఆ ఇద్దరు ఎన్ఆర్ఐలు స్నేహితులని ఆలయ అధికారులు చెప్పారు. వారి కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆలయానికి వచ్చి... రూ.14కోట్లు డిమాండ్ డ్రాఫ్ట్ ని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ఎన్ఆర్ఐలు భారీ విరాళం ప్రకటించారు. భారత సంతతికి చెంది.. అమెరికాలో స్థిరపడిన ఇద్దరు వ్యక్తులు.. స్వామి వారి ఆలయానికి రూ.14కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు స్వయంగా వెల్లడించారు.
శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వారు ఈ విరాళాన్ని ఆలయానికి ఇచ్చారు. ఆ ఇద్దరు ఎన్ఆర్ఐలు స్నేహితులని ఆలయ అధికారులు చెప్పారు. వారి కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆలయానికి వచ్చి... రూ.14కోట్లు డిమాండ్ డ్రాఫ్ట్ ని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు.
ఈ నగదుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం.. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ప్రజా సంక్షమ పథకాల కోసం వినియోగించాలని కోరారు. వీరు ఇలా ఆలయానికి నగదు ఇవ్వడం రెండోసారి కావడం విశేషం. గతేడాది జులైలో ఈ ఇద్దరు స్నేహితులు రూ.13.5కోట్లు స్వామి వారి ఆలయానికి అందజేశారు. ఈ సంవత్సరం రూ.14కోట్లు అందజేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 10, 2019, 10:34 AM IST