Asianet News TeluguAsianet News Telugu

అదరగొట్టిన షియోమీ: ఫెస్టివ్ సీజన్ లో 25 శాతం పెరిగిన సేల్స్

చైనాకు చెందిన షియామీ భారత్ లో రికార్డు స్థాయిలో మొబైల్ ఫోన్లను విక్రయించింది. 

Xiaomi sold 5.3 million devices during Diwali With Mi sale
Author
New Delhi, First Published Oct 6, 2019, 11:54 AM IST

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్​ ఫోన్ తయారీ దిగ్గజం షియోమీ ప్రస్తుత పండుగ సీజన్​లో రికార్డు స్థాయి అమ్మకాలు సాధించింది. దసరా ముందు నిర్వహించిన ప్రత్యేక సేల్​ ద్వారా మొత్తం 53 లక్షల డివైస్​లు విక్రయించినట్లు శనివారం వెల్లడించింది. వీటిలో మొత్తం 38 లక్షల స్మార్ట్​ఫోన్లు ఉన్నట్లు తెలిపింది.

గతేడాది ఇదే పండుగ సీజన్​తో పోలిస్తే 25 శాతం అమ్మకాలు పెరిగినట్లు షియోమీ పేర్కొంది. 2018లో ఈ సంస్థ మొత్తం 25 లక్షల స్మార్ట్​ఫోన్​లు విక్రయించింది. ఈ పండుగ సీజన్​లో షియోమీ భారీ అమ్మకాలు సాధించింది. మొత్తం 53 లక్షల డివైస్​లు (38 లక్షల స్మార్ట్​ఫోన్లు) విక్రయమయ్యాయి. 

‘ఈ కామర్స్​ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లలో రెడ్​ మీ నోట్​ 7 ఉత్తమ సెల్లింగ్​ స్మార్ట్​ ఫోన్​గా నిలిచింది. మొత్తం మీద ఈ సీజన్​లో సెకనుకు 535 డివైస్​​ల చొప్పున అమ్ముడయ్యాయి’ అని షియోమీ ఇండియా ఆన్​లైన్​ సేల్స్ అధిపతి రఘు రెడ్డి చెప్పారు. 

ఎంఐ డాట్​కామ్​ సహా ఇతర ఈ కామర్స్​ భాగస్వాములతో కలిపి షియోమీ సంస్థ.. స్మార్ట్​ ఫోన్లు, ఎంఐటీవీ, ఎంఐ బ్యాండ్​, ఎంఐ పవర్​బ్యాంక్​లు, ఎంఐ ఇయర్​ఫోన్స్​, ఎంఐ ఇకోసిస్టమ్​ డివైస్​​ల వంటి ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులను విక్రయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios