Dr Shaikh Yonus: నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నత శిఖరాలకు చేరిన ఒక వైద్యుని కథ ఇది..
Mumbai: పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, తన బంధువులు తమ పిల్లలతో పాటు మదర్సాకు పంపాలని పట్టుబట్టారు. కానీ అతను మాత్రం సాధారణ పాఠశాలకు వెళ్లాలనుకున్నాడు. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పగా.. అతని కోరికను గౌరవించాడు. సైన్స్ స్ట్రీమ్ వైపు ఆకర్షితుడై పదో తరగతిలో ఉన్నప్పుడే కెరీర్ మార్గాన్ని ఎంచుకున్నాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన తొలి ముస్లిం వైద్యునిగా (ఎంబీబీఎస్) గుర్తింపు సాధించారు. ఆయనే డాక్టర్ షేక్ యోనస్.

Senior Resident Dr Shaikh Yonus: పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, తన బంధువులు తమ పిల్లలతో పాటు మదర్సాకు పంపాలని పట్టుబట్టారు. కానీ అతను మాత్రం సాధారణ పాఠశాలకు వెళ్లాలనుకున్నాడు. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పగా.. అతని కోరికను గౌరవించాడు. సైన్స్ స్ట్రీమ్ వైపు ఆకర్షితుడై పదో తరగతిలో ఉన్నప్పుడే కెరీర్ మార్గాన్ని ఎంచుకున్నాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన తొలి ముస్లిం వైద్యునిగా (ఎంబీబీఎస్) గుర్తింపు సాధించారు. ఆయనే డాక్టర్ షేక్ యోనస్. లక్నోలోని ప్రతిష్ఠాత్మక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ కార్డియాలజీ విభాగంలో సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. మధ్య మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన తొలి ముస్లిం వైద్యుడుగా గుర్తింపు పొందిన ఆయన 2015లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
పదవ తరగతి వరకు గ్రామ పాఠశాలలో చదివిన ఈ 34 ఏళ్ల వైద్యుడికి ఈ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడ్డారు. అతని కుటుంబం వైద్య విద్యను చదివించడానికి అతనికి ఎంతగానో సహకారం అందించింది. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఎమిటంటే.. వైద్యునిగా మారిన తర్వాత కూడా ఆయన తన కుటుంబంతో కలిసి తమకున్న నాలుగు ఏకరాల భూమిలో పత్తిసాగు చేస్తున్నారు. ఇదే సమయంలో తన వైద్య సేవలను అందిస్తున్నారు. తన తండ్రి ఖుద్బుద్దీన్, అన్నయ్య అస్లాంతో కలిసి జల్నా జిల్లాలోని దధేగావ్ లో ఉన్న నాలుగు ఎకరాల భూమిలో పత్తి పండిస్తున్నారు. 800 మంది జనాభా ఉన్న తన వెనుకబడిన గ్రామంలో ఉన్నత పదవిలో ఉన్నవారు ఎవరూ లేరని చెప్పిన షేక్.. తన పాఠశాలలోని కొందరు సీనియర్లు తమ కెరీర్పై దృష్టి సారించి.. ఉపాధ్యాయులుగా మారారనీ, ఇది తనకు స్ఫూర్తినింపుతూ ముందుకు సాగడానికి ప్రేరేపించిందని తెలిపారు. షేక్ అన్ని అసమానతలతో పోరాడి మెడికల్ కాలేజీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించాడు.
డాక్టర్ యూనస్ తాను అనుభవించిన జీవితాన్ని వివరిస్తూ.. “ఇది చాలా పెద్ద పోరాటం. 62 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 2022లో మరణించిన మా నాన్న ఒక పత్తి రైతు. మహారాష్ట్రలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా కడు పేదరికంలోకి జారుకున్నాము.. మేము నలుగురు అన్నదమ్ములం - ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు. 2008లో నాన్న వార్షిక ఆదాయం రూ.30 వేలు. నా నెలవారీ గది అద్దె, సంవత్సరానికి జీవన ఖర్చుల కోసం రూ. 3000, మెడికల్ కాలేజీ ప్రవేశ పరీక్ష కోసం ఔరంగాబాద్లో ప్రొఫెషనల్ కోచింగ్ కోసం వార్షిక రుసుము రూ. 12,000 చెల్లించడం ఆయనకు కష్టంగా ఉండేది. అయినప్పటికీ నా చదువుల కోసం అప్పులు చేశారని" చెప్పారు.
తన ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాడ్ తాలూకాలో XI, XII తరగతులను పూర్తి చేశారు. నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తన ఆరు సంవత్సరాల MBBS కోర్సు కోసం షేక్ వార్షిక మైనారిటీ స్కాలర్షిప్ రూ. 25,000 పొందగలిగినప్పటికీ, ఆ సమయంలో తన ఇతర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ. 3000 ఆయన తండ్రి పంపించేవారని చెప్పారు. "మా నాన్నకు పరిమిత స్తోమత ఉండేది. నా సోదరీమణులను వివాహం చేసుకోవడానికి డబ్బు ఆదా చేయడం..నా ఫీజు కోసం రూ. 2000 కేటాయించడం చాలా పెద్ద సవాలు, కానీ మా నాన్న నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనివ్వలేదు. ఎంబీబీఎస్కు వార్షిక ఫీజు రూ.18,000. హాస్టల్ వార్షిక రుసుము రూ.4000. మిగిలిన మొత్తం పుస్తకాలు కొనడానికి వెచ్చించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆరు నెలలకు ఒకసారి తన కుటుంబాన్ని కలవడానికి రైలులో 16 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS చివరి సంవత్సరం తర్వాత షేక్ మొదటి సంపాదన వచ్చింది. “సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ సమయంలో, ప్రభుత్వం మాకు నెలకు 6000 రూపాయలు చెల్లిస్తోంది. దీని తర్వాత, నేను మెడిసిన్ ఎండీ కోసం నీట్ పరీక్షలో హాజరయ్యాను. దేశంలోనే 104వ ర్యాంక్ సాధించాను. మహారాష్ట్రలో మెడిసిన్ ఎండీకి 26 సీట్లు మాత్రమే ఉన్నాయి. పూణే సమీపంలోని మిరాజ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడేళ్లపాటు ఎండీ చదివే అవకాశం నాకు లభించింది. 2020లో ఎండీ పూర్తి చేశాను’’ అని చెప్పారు.
DM (డాక్టరేట్ ఇన్ మెడిసిన్) కోసం పోటీ మరింత కష్టం. ప్రతి సంవత్సరం కార్డియాలజీలో DM కోసం దరఖాస్తు చేసుకునే 3,000 మంది విద్యార్థులలో, పదవ వంతు మాత్రమే పూర్తి చేస్తారు. KGMU దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకుంటుంది. KGMUలో కార్డియాలజీలో DMకి ఎంపికైన ఎనిమిది మంది వైద్యులలో డాక్టర్ షేక్ కూడా ఉన్నారు.
జల్నా జిల్లా నుండి మరింత మంది యువ విద్యార్థులు మెడికల్ స్ట్రీమ్లో చేరి వైద్యులు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఫిబ్రవరి 2022లో, డాక్టర్ యూనస్ ఉత్తరప్రదేశ్లోని బాన్స్-బరేలీలో సర్జికల్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న తన జూనియర్ అయిన మహజాబిన్ను వివాహం చేసుకున్నారు. కాగా, ఆయన సోదరుడు అస్లాం మాట్లాడుతూ.. స్పెషలిస్ట్ అయిన తర్వాత, డాక్టర్ యూనస్ తన మూలాలను మరచిపోలేదు. ఇంటికి వచ్చినప్పుడల్లా తన తండ్రి వ్యవసాయ భూమిని చూసుకుంటాడు. భారతదేశ రైతుల కోసం ఈ డాక్టర్ గుండె చప్పుడు వినిపిస్తుందన్నారు.