Asianet News TeluguAsianet News Telugu

కవి "వసీరా" కు ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు

35 వ ఉమ్మడిశెట్టి సత్యా దేవి సాహితీ అవార్డు -2022 కోసం ప్రసిద్ధ సీనియర్ కవి వసీరా  "సెల్ఫీ" కవితా సంపుటి ఎంపికైనట్లు అవార్డు వ్యవస్థాపకులు డా. రాధేయ ప్రకటించారు. ఈ అవార్డుకు న్యాయ నిర్ణేతలుగా కొప్పర్తి వెంకట రమణ మూర్తి, డా.నాళేశ్వరం శంకరం, మందరపు హైమవతి వ్యవహరించారు.
 

Writer  Vaseera wins Ummadishetty Satyadevi Sahithi Award
Author
First Published Feb 8, 2023, 5:21 PM IST

సత్యాదేవి సాహితీ అవార్డు  అవార్డు పొందిన  "సెల్ఫీ" వసీరా మూడవ కవితా సంపుటి. వీరు 1980 నుంచీ రాస్తున్న సీనియర్ కవి. వసీరా " సెల్ఫీ "  కవిత్వంలో సమస్త విశ్వాన్నీ ఆలింగనం చేసుకొనే ఒక అద్వితీయ దివ్యానుభవం మనకు కల్గుతుం దని న్యాయ నిర్ణేతలు అభిప్రాయ పడినట్లుగా డా. రాధేయ  వివరించారు.

ఈ అవార్డు పొందిన కవుల్లో వసీరా 35 వ వారు. త్వరలో అనంతపురంలో జరిగే సభలో కవికి అవార్డు ప్రదానం చేయనున్నట్టు ఉమ్మడి లిటరరీ ట్రస్ట్, అనంతపురం తరఫున డా. రాధేయ తెలియజేశారు.


 
 

Follow Us:
Download App:
  • android
  • ios