దాసరి  మోహన్ రచించిన ' వెంకటయ్య బావి ' నవల సోమవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో  నందిని సిధారెడ్డి  ఆవిష్కరిస్తారు.  ఈ సభ వివరాలు ఇక్కడ చదవండి : 

దాసరి మోహన్ రచించిన ' వెంకటయ్య బావి ' నవల సోమవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో నందిని సిధారెడ్డి ఆవిష్కరిస్తారు. ఈ సభ తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రముఖ రచయిత రూప్ కుమార్ డబ్బీ కార్ పుస్తక పరిచయం చేస్తారు. కాంచన పల్లి గోవర్థనరావు ( తంగేడు), పొత్తూరి సుబ్బారావు ( సాహితీ కిరణం) విశిష్ట అతిథులుగా, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరo శంకరం, వఝల శివ కుమార్ , రమాదేవి కులకర్ణి ఆత్మీయ అతిథులుగా వస్తున్నారని జంట నగరాల అధ్యక్షులు కందుకూరి శ్రీరాములు మరియు కార్యదర్శి బెల్లం కొండ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గత కొంత కాలంగా కవిత్వం, కథలు రాస్తున్న దాసరి మోహన్ ఇప్పుడు ' వెంకటయ్య బావి ' నవలతో పాఠకుల ముందుకు వస్తున్నారు. వీరు గతంలో దండెం (2019), అల్మారా (2021 ) కవితా సంపుటాలు మరియు 17 కథలతో ' రాళ్ల కుచ్చె ' కథా సంపుటి వెలువరించిన పాఠకుల మన్ననలు అందుకున్నారు. వీరు గతంలో నమస్తే తెలంగాణా దిన పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతి ( రూ.21,000 /- ) మరియు పాలపిట్ట , సాహితీ కిరణం , విశాలాక్షి మాస పత్రిక ఇతర సాహిత్య సంస్థలు నిర్వహించిన వివిధ కథల, కవితల పోటీలలో కూడా పలు బహుమతులు అందుకున్నారు.