ప్రముఖ రచయిత వెంకట శిద్ధారెడ్డికి ఈ ఏడాది రంగినేని ఎల్లమ్మ సాహితీ పురష్కారం లభించింది. యేటా ఈ అవార్డును రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల వారు అందిస్తున్నారు.
రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల వారు ఒక సంవత్సరం కవితకు మరో సంవత్సరం కథకు ' రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం' ఇస్తూ తమ వంతు సాహిత్య సేవ గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం 2020 సంవత్సరానికి గాను న్యాయ నిర్ణేతల మూల్యాంకనం మేరకు వెంకట్ శిద్ధారెడ్డి కథా సంపుటి 'పోల్ సర్కస్ ' ఎంపికైన విషయాన్ని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రంగినేని మోహన్ రావు, అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ అవార్డు కింద పురస్కార గ్రహీతకు రూ. 20,116/- నగదు, జ్ఞాపిక, శాలువ మరియు పురస్కార పత్రం ట్రస్ట్ ఆవరణలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 10, 2021, 11:30 AM IST