Asianet News TeluguAsianet News Telugu

"పద్మశాలి మొగ్గలు" కవితాసంపుటి ఆవిష్కరణ

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పద్మశాలి వంశ చరిత్రను పద్మశాలి మొగ్గలు పేర కవిత్వంగా రాశారు. ఆ కవిత్వ పుస్తకాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

Telangana minister Srinivas Goud releases Bheempalli Srikanth poetry book
Author
Mahabubnagar, First Published Aug 23, 2021, 2:16 PM IST

పాలమూరు జిల్లా ప్రముఖ కవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రచించిన పద్మశాలి వంశ చరిత్రను తెలిపే "పద్మశాలి మొగ్గలు" కవితాసంపుటిని రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడా, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖామంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. 

ఆగష్టు 22 న మహబూబ్ నగర్ పట్టణంలోని అయ్యప్పగుట్టపై గల శివమార్కండేయ దేవాలయ ప్రాంగణంలో రాఖీ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి "పద్మశాలి మొగ్గలు" కవితాసంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి వస్త్రాలనందించిన పద్మశాలి వంశ చరిత్రను సమాజంలోని అందరికీ తెలిసేలా రచించడం అభినందనీయమని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మచ్చ వాణి ప్రభాకర్ రావు, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, 1 వ వార్డు కౌన్సిలర్ గడ్డం రోజా వెంకటేష్, నాయకులు బాస రామస్వామి, తిరుమల వెంకటేష్, బుదారపు వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios