Asianet News TeluguAsianet News Telugu

మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు దక్కింది. 

Shashi Tharoor wins Sahitya Akademi Award 2019 for An Era Of Darkness
Author
New Delhi, First Published Dec 18, 2019, 6:25 PM IST

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ 2019 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన శశిథరూర్ తిరువనంతపురం నుండి ఎంపీగా ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్: ది బ్రిటిష్ ఎంపెర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని శశిథరూర్ రాశారు.ఈ పుస్తకం 2016లో ప్రచురించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఏడాది డిసెంబర్ 18వ తేదీన  ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్‌లో భాషలో రాసిన ఆయన పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. దేశంలోని 23 భాషల్లో అవార్డులను ఇచ్చింది.

దేశంలో బ్రిటిష్ పాలన గురించి ఈ పుస్తకంలో శశిథరూర్ ప్రస్తావించారు. శశిథరూర్ 1975లో సెయింట్ స్టీఫెన్ కాలేజీ న్యూఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. 1978లో ఇంటర్నేషనల్ సంబంధాలపై డాక్టరేట్‌ను పూర్తి చేశాడు. 

ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ , పబ్లిక్ రిలేషన్స్ లో పనిచేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios