సాహితీ కిరణం  ఉగాది కవితల పోటీ ఫలితాలు విడుదల చేశారు. విజేతల వివరాలను  పొత్తూరు సుబ్బారావు ప్రకటించారు.

హైదరాబాద్: శ్రీ కార్తీక డెవలపర్స్, సాహితీ కిరణం మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర జాతీయస్థాయి ఉగాది కవితల పోటీ ఫలితాలను సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు ప్రకటించారు. 

విజేతల వివరాలు ...
1. ప్రథమ బహుమతి రూ.2,500/-
పరిమి వెంకట సత్యమూర్తి, హైదరాబాద్. కవిత - నిశ్శబ్ద సౌందర్యం.

2.ద్వితీయ బహుమతి: రూ. 2,000/-
పొత్తూరి సీతారామరాజు, కాకినాడ . కవిత - మళ్లీ వాడు ఒకసారి నవ్వుతాడు.

3.తృతీయ బహుమతి : రూ.1,500/-
షేక్ కాశీం బీ, గుంటూరు. కవిత - అల్ట్రా మోడరన్

రెండు ప్రత్యేక బహుమతులు ఇద్దరికీ రూ.1,000/- చొప్పున 
కళా గోపాల్, నిజామాబాద్. కవిత : దయచేసి మా చీరెల వెల అడక్కండి

కోనేటి నరేష్ , ఏ.బీ. పల్లి. కవిత - నవభారతంలో సామాన్యుడి జీవితం

బహుమతి ప్రధానోత్సవం ఏప్రిల్ 2024 లో సాహితీ కిరణం కార్యాలయం పొత్తూరులో (గుంటూరు దగ్గర ) నిర్వహించే "ఉగాది సంబరాలు" కార్యక్రమంలో ఉంటుందని 
సంపాదకులు పొత్తూరి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు.

l