తెలుగు సాహిత్యంలో హైకూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కొన్ని   హైకూలను   ' బతుకు నడక 'లో చదవండి : 

మనిషి కదా
కొమ్ములతో కుమ్మేసే
బతుకు ఆపు

అమ్మను తిన్నా
మట్టిని దోచుకున్నా
మౌనంలో మనం

హద్దులు లేని
నాగరికత ఏందో
కన్ను గానకా

శ్రమ సేద్యం
ఏకధాటి వర్షమే 
అదో బతుకు!

స్నేహం తల్లిగా
కష్టాలూ కన్నీళ్ళలో
ఈతే జీవితం