పాలమూరు సాహితి అవార్డు కోసం నిర్వాహకులు కవితా సంకలనాలను ఆహ్వానిస్తున్నారు యేటేటా ఇచ్చే అవార్డు కోసం ఉత్తమ కవితా సంకలనాన్ని ఎంపిక చేసి అవార్డు అందజేస్తున్నారు.
తెలుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు పాలమూరు సాహితి అవార్డును గత దశాబ్దకాలంగా ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే 2020 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితాసంపుటాలను కవుల నుండి ఆహ్వానిస్తున్నాము. కవులు మూడేసి ప్రతులను మార్చి 30 లోపు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇం.నెం.8-5-38,టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్-509001 అనే చిరునామాకు పంపగలరు. బహుమతి పొందిన కవితాసంపుటికి 5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు.
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, వ్యవస్థాపకులు,
పాలమూరు సాహితి అవార్డు
9032844017
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Feb 19, 2021, 1:53 PM IST