Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రిలో జాతీయ సదస్సు... నల్గొండ బిడ్డలకు ఆహ్వానం

నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు రాజమండ్రిలో జరిగే జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. 

Nalgonda teachers received invitation to national conference in rajahmundry
Author
First Published Feb 2, 2023, 12:25 PM IST

హైదరాబాద్ : నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, మైసూరుకు చెందిన భారతీయ భాషా సంస్థ, రాజమండ్రిలోని  ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో రాజమండ్రిలో జాతీయ సదస్సు ఏర్పాటుచేసారు. ఈ జాతీయ సదస్సుకు నల్లగొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన పరిశోధకులు డాక్టర్ మండల స్వామి, సాగర్ల సత్తయ్యలకు ఆహ్వానం అందింది. 

చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, పాఠ్యపుస్తక రచయిత సాగర్ల సత్తయ్య ఈ సదస్సులో 'శివ కవులు - చారిత్రక సాంస్కృతిక సామాజిక దృక్పథం' అనే అంశంపై పత్ర సమర్పణ చేయనున్నారు.  ఫిబ్రవరి 3న ఈ కార్యక్రమం జరగనుంది. 

ఇక ఇదే చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్ మండల స్వామి ' నల్లగొండ జిల్లా గ్రామ నామాలు ' అనే అంశంపై పరిశోధన చేశారు.  ఈ సదస్సులో ప్రాచీన గ్రామ నామాలు చారిత్రక సాంస్కృతిక సామాజిక దృక్పథం అనే అంశంపై పత్ర సమర్పణ చేయనున్నారు.  ఇది  ఫిబ్రవరి 4న వుండనుంది.

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సుకు మండలానికి చెందిన పరిశోధకులు ఎంపిక కావడం పట్ల పలు సాహిత్య సంస్థలు,  పలువురు సాహిత్యాభిమానులు అభినందనలు తెలిపారు. నల్గొండ బిడ్డలకు జాతీయ సదస్సు ఆహ్వానం అందడం జిల్లాకే గర్వకారణమని చిట్యాల ప్రజలు అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios