Asianet News TeluguAsianet News Telugu

నిరంతర అధ్యయనం, నిర్విరామ అభ్యాసం అవసరం : ప్రముఖ కవి డా.ఏనుగు నరసింహారెడ్డి

శాసనమండలి అధ్యక్షుడి వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.ఏనుగు నరసింహారెడ్డిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక మంగళవారం శాసనమండలిలోని ఆయన కార్యాలయంలో సన్మానించాయి.

medchal malkajgiri district sahitya vedika and darpanam Sahitya Vedika fecilitates Dr Enugu Narasimha Reddy ksp
Author
First Published Aug 8, 2023, 8:42 PM IST

నిరంతర అధ్యయనం, నిర్విరామ అభ్యాసం కవులకు అవసరమని శాసనమండలి అధ్యక్షుడి వ్యక్తిగత కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఇటీవలి కాలం వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరుగా పనిచేసి, శాసనమండలి అధ్యక్షుడి వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.ఏనుగు నరసింహారెడ్డిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక మంగళవారం శాసనమండలిలోని ఆయన కార్యాలయంలో సన్మానించాయి. ఈ సందర్భంగా ఆ సంస్థల బాధ్యులతో ఆయన ఆత్మీయంగా సంభాషించారు.

అధ్యయనాన్ని వీడకుండా అభ్యాసాన్ని కొనసాగించాలని డా. ఏనుగు నరసింహారెడ్డి సూచించారు. వర్ధమాన కవులు సాహిత్య రంగంలో ఎదిగేందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సాహిత్యంలోని వివిధ అంశాలపై కవులకు లోతైన అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వేదికల అధ్యక్షుడు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, ప్రధాన కార్యదర్శి డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, కార్యదర్శి గుండం మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణ చంద్రమౌళి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, కవులు కొమ్ము వరలక్ష్మి, తిరుపతి, వద్దిరాజు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios