స్వర్గీయ కందూరు బుచ్చమ్మ బుచ్చారెడ్డి స్మారక సాహితీ పురస్కార సభ 2023 కు ఆహ్వానం పలుకుతున్నారు నిర్వాహకులు. 

స్వర్గీయ కందూరు బుచ్చమ్మ బుచ్చారెడ్డి స్మారక సాహితీ పురస్కారం 2023 కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వచన కవుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. న్యాయనిర్ణేతల ఎంపిక మేరకు పురస్కార గ్రహీతలకు ఈ రోజు పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వచన కవితా సంపుటాల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఈ రోజు అనగా 3 ఏప్రిల్ 2023 న సాయంత్రం 5 గంటలకు MYS బ్యాంకెట్ హాల్, KDR నగర్, వనపర్తిలో జరుగుతుంది.

సాహితీ కళావేదిక, వనపర్తి జిల్లా వారు ఆహ్వానిస్తున్న ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరవుతున్నారు.సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ సభాధ్యక్షులుగా కొనసాగే ఈ సభలో ప్రథమ బహుమతి కాళోజి పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డికి, ద్వితీయ బహుమతి యువ కవి ఉప్పరి తిరుమలేశ్ కు, ప్రోత్సాహక బహుమతి మరో యువ కవి తెలుగు తిరుమలేశ్ 
కు ప్రధానం చేస్తున్నారు. పురస్కార గ్రహీతలకు విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు కందూరు నారాయణరెడ్డి అభినందనలు తెలియజేస్తారు.