Asianet News TeluguAsianet News Telugu

కే.ఆర్ మూర్తి, కుప్పిలి పద్మలకు అరుణ్ సాగర్ ట్రస్ట్ పురస్కారాలు

ప్రముఖ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మ లకు అరుణ్ సాగర్ పురస్కారం వరించింది,  

K Ramachandra Murthy and Kuppili Padma wins Arun Sagar Awards
Author
First Published Jan 31, 2023, 4:28 PM IST

హైదరాబాద్ : ప్రముఖ కవి, విలక్షణ జర్నలిస్టు అరుణ్ సాగర్ పేరిట ఇచ్చే పురస్కారాలు ఈ సంవత్సరం ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్ర మూర్తి,  కవయిత్రి కుప్పిలి పద్మ లను వరించాయి. అరుణ్ సాగర్ పాత్రికేయ పురస్కారం రామచంద్ర మూర్తికి, సాహితీ పురస్కారం కుప్పిలి పద్మకు అందించనున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రాచలం పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో వచ్చే నెల (ఫిబ్రవరి) 12వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ప్రకటించింది. 

K Ramachandra Murthy and Kuppili Padma wins Arun Sagar Awards

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే సభలో విశిష్ట అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టిఎస్పిఎస్సి. మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి తదితరులు పాల్గొంటారని అరుణ్ సాగర్ ట్రస్ట్ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios