టీచర్స్ డే 2022: ప్రతి ఏడాది మనం సెప్టెంబర్ 5 వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ దినోత్సవాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
టీచర్స్ డే 2022: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన విద్యార్థులంతా టీచర్స్ డేను జరుపుకుంటారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. డాక్టర్ రాధాకృష్ణన్ భారతదేశపు మొదటి ఉప రాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేసి ఎన్నో సేవలనందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5 న జన్మించారు. ఈయన గొప్ప తత్వవేత్తగా, ఉపాధ్యాయుడిగా, పండితుడిగా ఎన్నో సేవలందించాడు.
డాక్టర్ రాధాకృష్ణన్ విద్య ద్వారా ప్రపంచాన్ని మార్చే దిశగా యువతను ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప ఉపాధ్యాయులను గౌరవించాలనే ఉద్దేశ్యంతో తన జయంతిని 'ఉపాధ్యాయ దినోత్సవం'గా జరుపుకోవాలని నిశ్చయించారు. దాంతో 1962 నుంచి సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం..
టీచర్స్ డే ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఎందుకంటే విద్యార్థులు తమ గురువులను గౌరవించే రోజు ఇది. ఇంతటి గొప్ప రోజును ప్రతి పాఠశాల, సంస్థ జరుపుకుంటుంది. ఇక విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు, పాఠాలను గౌరవించేందుకు కవితలు, స్కిట్లు, ఉపన్యాసాలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలతో సహా వివిధ పాఠ్యేతర కార్యకలాపాలను ప్లాన్ చేస్తారు. ఈ టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి విద్యార్థులు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం పదండి..
- డాక్టర్ రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5న తిరుత్తణిలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఇతను తన ప్రతిభతో జీవితాంతం ఎన్నో స్కాలర్ షిప్ ను గెలుచుకున్న అత్యత్తమ విద్యార్థిగా పేరుపెందారు. రాధాకృష్ణన్ తిరుపతి, వెల్లూరులోని పాఠశాలలో చదువుకున్నారు.
- డాక్టర్ రాధాకృష్ణన్ మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఇతను భారతదేశంలోని అత్యుత్తమ తత్వవేత్తలలో ఒకరిగా పేరుసంపాదించుకున్నారు.
- డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వశాస్త్ర ప్రొఫెసర్ గా, ఆ తర్వాత మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశాడు.
- 1962లో డాక్టర్ రాధాకృష్ణన్ భారతదేశపు రెండో రాష్ట్రపతిగా నియమితుడయ్యాడు. 1967 వరకు ఈ పదవిలో కొనసాగాడు.
- Philosophy of Rabindranath Tagore,జీవితానికి ఒక ఆదర్శవాద దృక్పథం, ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, సమకాలీన తత్వశాస్త్రంలో మతం యొక్క పాలన, కల్కి ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ సివిలైజేషన్, గౌతమ బుద్ధుడు, ది రిలీజియన్ వి నీడ్, ఇండియా అండ్ చైనా వంటి ఎన్నో ప్రసిద్ధ రచనలు చేశారు డాక్టర్ రాధాకృష్ణన్ .
