Asianet News TeluguAsianet News Telugu

పోలీసులకు భయపడి పారిపోతూ... బావిలో పడి యువకుడి మృతి (వీడియో)

పోలీసులకు భయపడి పారిపోతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృత్యువాతపడ్డాడు. 

young boy death in karimnagar district
Author
Karimnagar, First Published Sep 9, 2020, 9:28 PM IST

కరీంనగర్: మూడు రోజుల క్రితం ఓ కేసు విషయమై టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో భయపడి పారిపోయిన ఓ యువకుడి మృతదేహం బుధవారం వ్యవసాయ బావిలో లభ్యమయ్యింది. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...కరీంనగర్  జిల్లా  గంగాధర మండలం గోపాల్ రావు పల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో పడి సాయి అనే యువకుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం  టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ కేసు విషయంపై రావడంతో భయపడి పారిపోయిన యువకుడు సాయి(లడ్డు) పారిపోతుండగా వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. 

"

దీంతో తమ కొడుకు మరణానికి టాస్క్ ఫోర్స్ పోలీసులే కారణామని మృతుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే అక్రమ కేసులు పెట్టి తమ కొడుకును నాలుగు నెలలు జైల్లో ఉంచారంటూ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించనివ్వకుండా పోలిసుల వాహనాల ముందు బైఠాయించారు. అయితే వారిని పక్కకు జరిపి మృతదేహాన్ని కరీంనగర్ కి తరలించారు. దీంతో గంగాధరకి చేరుకున్న సాయి స్నేహితులు, బంధువులు జగిత్యాల, కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించిన ఆందోళన చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios