Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో విషాదం... రైతు దంపతులను ఢీకొన్న లారీ, భర్త మృతి

కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతిచెందగా అతడి భార్య కొన ఊపిరితో చికిత్స పొందుతోంది. 

couple caught accident in jagitial
Author
Jagtial, First Published Apr 18, 2020, 7:54 PM IST

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో  విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనులనిమిత్తం పొలానికి వెళ్లిన ఓ రైతు దంపతులు తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మితిమీరిన వేగంతో వెనుకనుండి వచ్చిన లారీ రోడ్డపక్కనుండి వెళుతున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త గంగారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా వుంది. 

దీంతో స్థానికులు ఆమెను వెంటనే జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని... కాపాడటానికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు తాటిపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. ఈ గ్రామ శివారులోనే ప్రమాదం జరిగినట్లు  వెల్లడించారు. ప్రస్తుతం లారీతో పాటు డ్రైవర్ కూడా పరారీలో వున్నట్లు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించి డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios