ఫిలిఫ్పిన్స్లో భూకంపం
సెంట్రల్ ఫిలిప్ఫిన్స్లో సోమవారం నాడు భూ కంపం సంభవించింది. భూకంపలేఖినిపై 6.3 గా భూకంప తీవ్రత నమోదైంది.
మనీలా: సెంట్రల్ ఫిలిప్ఫిన్స్లో సోమవారం నాడు భూ కంపం సంభవించింది. భూకంపలేఖినిపై 6.3 గా భూకంప తీవ్రత నమోదైంది.
మనీలాకు 60 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.భూకంప తీవ్రతకు పంపంగ రాష్ట్రంలో ఓ చర్చి ధ్వంసమైనట్టుగా సమాచారం అందుతోంది.
మరో వైపు ఓ పర్వతంపై ఉన్న బండరాళ్లు రహాదారికి అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారినట్టుగా అధికారులు చెబుతున్నారు. వందలాది మంది ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుండి భయంతో పరుగులు తీశారు.