కొలంబో ఎయిర్పోర్ట్ వద్ద బాంబు కలకలం
శ్రీలంక రాజధాని కొలంబోను బాంబుల భయం వెంటాడుతూనే ఉంది. ఆదివారం వరుస పేలుళ్ల నేపథ్యంలో సైన్యం, పోలీసులు నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
శ్రీలంక రాజధాని కొలంబోను బాంబుల భయం వెంటాడుతూనే ఉంది. ఆదివారం వరుస పేలుళ్ల నేపథ్యంలో సైన్యం, పోలీసులు నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కొలంబో విమానాశ్రయం సమీపంలో శక్తివంతమైన బాంబును గుర్తించారు.
వెంటనే దీనిని నిర్వీర్యం చేయడంతో భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు మరింత ముమ్మరం చేశాయి. ఆదివారం చర్చ్లు, హోటళ్లను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లలో 290 మంది మరణించగా, 500 మంది వరకు గాయపడ్డారు.